Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
విడుదలై రోజులు గడుస్తున్నా షాక్ లో ఆర్యన్.. గది నుంచి బయటకు రావాలన్నా టెన్షన్.. టెన్షన్?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. జైలు అనుభవం ఆర్యన్ ఖాన్కు షాకింగ్గా ఉందని దాని నుండి కోలుకోవడానికి అతనికి చాలా సమయం పట్టవచ్చని చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
'షాక్'లోనే ఆర్యన్
జైలు
నుంచి
వచ్చిన
తర్వాత
కూడా
ఆర్యన్
'షాక్'లోనే
ఉన్నాడని
షారుక్
ఖాన్
కుటుంబానికి
సన్నిహితులు
చెబుతున్నారు.
'బాలీవుడ్
హంగామా'లోని
కథనం
ప్రకారం,
జైలు
నుంచి
వచ్చిన
తర్వాత,
ఆర్యన్
పూర్తిగా
నిశ్శబ్దంగా
మరియు
ఒంటరిగా
జీవించడం
ప్రారంభించాడని
అంటున్నారు.
సన్నిహితులు
చెబుతున్న
దాని
ప్రకరం
ఆర్యన్
ఎవరితోనూ
ఎక్కువగా
మాట్లాడడం
లేదని
తెలుస్తోంది.
పూర్తిగా సైలెంట్ అయ్యారు
అంతే కాక ఆర్యన్ ఒంటరిగా జీవిస్తున్నాడని చెబుతున్నారు. ఎక్కువ సమయం ఆర్యన్ తన గదిలోనే ఉంటున్నాడని, అతనికి బయటకు వెళ్లడానికి మరియు స్నేహితులను కలవడానికి ఆసక్తి లేదని అంటున్నారు. ఆర్యన్ మాములుగానే చాలా ప్రశాంతంగా ఉన్నాడని, అయితే జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత అతను పూర్తిగా సైలెంట్ అయ్యాడని చెబుతున్నారు.
భద్రత గురించి ఆందోళన
ఇక ఇటీవల, షారుక్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ భద్రత గురించి ఆందోళన చెందుతున్నాడని మరియు అతని భద్రతను పెంచే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. అయితే, కుటుంబ సన్నిహిత వర్గాలు దీన్ని ఖండించాయి. ఆర్యన్కు ప్రత్యేక బాడీగార్డ్ను ఏర్పాటు చేసే ఆలోచన ఇంకా లేదని చెబుతున్నారు. ప్రస్తుతం షారుక్ ఆర్యన్తో ఎక్కువ సమయం గడుపుతున్నాడు మరియు అతను ఇంకా తన సినిమాల షూటింగ్ని తిరిగి ప్రారంభించలేదని వెల్లడించలేదు.
అలా అరెస్ట్
అక్టోబర్
2న
ముంబై
నుంచి
గోవా
వెళ్తున్న
క్రూయిజ్
షిప్పై
నార్కోటిక్స్
కంట్రోల్
బ్యూరో
రైడ్
చేసి
ఆర్యన్ని
అరెస్ట్
చేసిన
సంగతి
తెలిసిందే.
ఆ
తరువాత
ఆర్యన్
ఖాన్
డ్రగ్స్
వాడుతున్నాడని
ఏకంగా
వ్యాపారంలో
పాల్గొంటున్నాడని
NCB
ఆరోపించింది.
ఆర్యన్తో
పాటు
అర్బాజ్
మర్చంట్,
మున్మున్
ధమేచా
కూడా
అరెస్టయ్యారు.
ఈ
ముగ్గురు
నిందితులను
షరతులతో
కూడిన
బెయిల్పై
విడుదల
చేయాలని
బాంబే
హైకోర్టు
ఆదేశించింది.
10 గంటలకు పైగా విచారణ
ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ కేసులో స్వతంత్ర సాక్షిగా మారిన ప్రభాకర్ సెయిల్ను ఎన్సీబీకి చెందిన ఢిల్లీ విజిలెన్స్ బృందం 10 గంటలకు పైగా విచారించింది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కేసుకు సంబంధించిన దోపిడీ ఆరోపణలపై ప్రభాకర్ను ప్రశ్నించినట్లు ఎన్సిబి అధికారి తెలిపారు. మంగళవారం మళ్లీ ఎన్సీబీ అతడిని విచారణకు పిలిచింది.
Recommended Video
ఎన్సీబీ సమన్లు
ఆదివారం ప్రభాకర్కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ప్రభాకర్ తన లాయర్తో కలిసి మధ్యాహ్నం 2 గంటలకు బాంద్రా శివారులోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మెస్కు చేరుకున్నాడు. విచారణ అనంతరం మధ్యాహ్నం 12:20 గంటల ప్రాంతంలో తన లాయర్తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటికే అక్కడ ఉన్న మీడియాతో ప్రభాకర్ ఇంటరాక్ట్ కాలేదు. సెల్ ఆరోపణల తర్వాత, NCB వెంటనే NCB అధికారిపై విచారణ కమిటీని సిద్ధం చేసింది, దాని గురించి ఇప్పుడు విచారణ కొనసాగుతోంది.