Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ వెబ్ సిరీస్: షారుక్ ఖాన్ మీద పాకిస్థాన్ ఆర్మీ ఆగ్రహం
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ నిర్మాతలుగా రూపొందిన వెబ్ సిరీస్ 'బార్డ్ ఆఫ్ బ్లడ్'. ఈ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ 27, 2019 నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కాబోతోంది. ప్రమోషన్లో భాగంగా షారుక్ ఖాన్ 'బార్డ్ ఆఫ్ బ్లడ్' ట్రైలర్ తన ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేశారు.
అయితే షారుక్ ఖాన్ ఈ ట్రైలర్ షేర్ చేసిన వెంటనే పాకిస్థాన్ ఆర్మీ నుంచి ఆయనక విమర్శలు ఎదురయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ ధారావాహికను నిర్మించిన షారుక్ ఖాన్పై ఫైర్ అయ్యారు. కశ్మీర్ విషయంలో జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా శాంతి, మానవత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. గఫూర్ పాకిస్తాన్ సాయుధ దళాల చీఫ్ స్పోక్ పర్సన్ అనే సంగతి తెలిసిందే.
'బార్డ్ ఆఫ్ బ్లడ్' వెబ్ సిరీస్ బిలాల్ సిద్దిఖి రచించిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూపొందించారు. ఈ ట్రైలర్ బలూచిస్తాన్ (పాకిస్తాన్లోని ఒక ప్రావిన్స్) లో ప్రారంభమవుతుంది, ఇక్కడ భారత గూఢచారులు అక్కడి ఉగ్రవాదుల చేతికి చిక్కుతారు. వారిని చంపి ఇండియాకు ఒక మేసేజ్ పంపాలనేది వారి ప్లాన్. మాజీ గూఢచారి కబీర్ ఆనంద్ (ఇమ్రాన్ హష్మి ), ఇషా (శోభితా ధూళిపాల), వీర్ (వినీత్ కుమార్ సింగ్) కలిసి రెస్క్యూ మిషన్ కోసం బలూచిస్తాన్ వెళ్ళమని పిఎంఓ నుంచి పిలుస్తుంది. బెలూచిస్తాన్ రెస్క్యూ-కమ్-సూసైడ్ మిషన్లో ఈ ముగ్గురు గూఢచారులు చేసిన ఉత్కంఠభరితమైన ప్రయాణం ఏమిటనేది ఈ వెబ్ సిరీస్లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.
జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు ఆ రాష్ట్రాన్ని భారత్ ప్రభుత్వం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇండియాతో వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. ఈ సమయంలో షారుక్ ఖాన్ మీద గపూర్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది.