twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోడ్డు ప్రమాదంలో నటి మనీషా రాయ్ దుర్మరణం

    By Bojja Kumar
    |

    భోజ్‌పురి నటి మనీషా రాయ్(45) రోడ్డు ప్రమాదంలో దర్మరణం పాలయ్యారు. షూటింగులో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనక నుండి వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

    బస్ది నుండి మనియార్ వెళ్లే రహదారిపై మనియార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చితౌనీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. చనిపోయింది సినిమా యాక్టర్ అని తెలియడంతో భారీ సంఖ్యలో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.

    Manisha Rai

    ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ గంగూలీ వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

    సమీప ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండటంతో తన అసోసియేట్‌ సంజీవ్ మిశ్రాతో కలిసి మనీషా రాయ్ బయల్దేరిందని, ఈ ప్రమాదంలో సంజీవ్ మిశ్రా గాయాలతో బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు.

    English summary
    A 45-year-old Bhojpuri film actress was killed in a road accident in Ballia, police said. Manisha Rai, who has featured in short films including Kohbar, was on her way to a shoot on a motorcycle when a car hit her motorbike.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X