Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
రోడ్డు ప్రమాదంలో నటి మనీషా రాయ్ దుర్మరణం
భోజ్పురి నటి మనీషా రాయ్(45) రోడ్డు ప్రమాదంలో దర్మరణం పాలయ్యారు. షూటింగులో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనక నుండి వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
బస్ది నుండి మనియార్ వెళ్లే రహదారిపై మనియార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చితౌనీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. చనిపోయింది సినిమా యాక్టర్ అని తెలియడంతో భారీ సంఖ్యలో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.
ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ గంగూలీ వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
సమీప ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండటంతో తన అసోసియేట్ సంజీవ్ మిశ్రాతో కలిసి మనీషా రాయ్ బయల్దేరిందని, ఈ ప్రమాదంలో సంజీవ్ మిశ్రా గాయాలతో బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు.