Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Bigg Boss EX కంటెస్టెంట్కి అదిరే ఆఫర్, న్యూడ్ యోగా కావాలంటూ డిమాండ్.. 50 లక్షలయితే ఓకేనట!
బిగ్ బాస్ 15 ముందు నుంచి కంటే ఈ సారి భిన్నమైన పద్ధతిని అనుసరిస్తోంది. మొదటి సారిగా బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం చేయబడుతుంది. ఇది 6 వారాల పాటు మాత్రమే జరగనుంది. ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. అయితే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మరియు న్యూడ్ యోగా గురువు వివేక్ మిశ్రాను బిగ్ బాస్ ఒటీటీ కోసం మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. అతను ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించాడు, ఈ ప్రదర్శనలో తనను సెమీ న్యూడ్ యోగా టెంపర్ చేయమని మేకర్స్ అడిగారని అన్నారు, కానీ నేను అందుకు నిరాకరించానని ఆయన వెల్లడించారు.
ఒక జాతీయ వెబ్ సైట్ తో వివేక్ మిశ్రా మాట్లాడుతూ, ఈ ఓటీటీలో భాగంగా న్యూడ్ యోగా లేదా సెమీ న్యూడ్ యోగా చేయమని కంటెంట్కి మసాలా జోడించమని నన్ను అడిగారని అన్నారు. ఇది విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓటీటీలో బిగ్ బాస్ని మరింత స్పైసీగా చేయడానికి మేకర్స్ 5X కంటెస్టెంట్ల కోసం వెతుకుతున్నారని ఆయన అన్నారు. అగ్రశ్రేణి రియాలిటీ షోను మసాలాగా చేయడానికి నేను ఎందుకు న్యూడ్ యోగా చేస్తాను అని ఆయన ప్రశ్నించారు. అయితే చాలా సెక్సీగా ఉన్నానని, అలా చేయడం చాలా ఖరీదైనదని చెప్పానని వెల్లడించారు. మీకు ఈ విధంగా కావాలంటే, దీని కోసం రోజుకు 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నేను స్పష్టం చేశానని వివేక్ మిశ్రా చెప్పారు.
నేను స్టార్ ని కాదు అన్న ఆయన అలా అయ్యేందుకు న్యూడ్ యోగా ఆధారంగా షోలో కనిపించడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఈ ఆఫర్ని తిరస్కరించానని, అర్ధం లేకుండా షోలు చేయడం కంటే నాణ్యమైన ప్రాజెక్ట్లు, అతిధి పాత్రలలో తాను భాగం కావాలనుకుంటున్నానని వివేక్ చెప్పాడు. నిజాయితీగా ఉండాలంటే, యాంకర్ మీద ఆధారపడి రియాలిటీ షో నడవదని ఆయన అన్నారు. అతని సహకారం ఖచ్చితంగా ఉండాలి కానీ విజయానికి ప్రధాన కారణం పోటీదారులు మరియు కంటెంట్ అని అన్నారు. అప్పుడు సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లేదా జెన్నిఫర్ లోపెజ్ ఎవరు అయినా, వారి పర్సనాలిటీ, గ్లామర్ కోసం షోలో చేర్చబడ్డారు, కానీ పోటీదారులు మంచిగా ఉన్నప్పుడే షో నడుస్తుందని అన్నారు. మొత్తానికి ఆయన వ్యవహారం అయితే షో మొత్తం మీద హాట్ టాపిక్ గా మారింది అని చెప్పక తప్పదు.