Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మరణానికి ముందు 100 డయల్.. దిశ సలియాన్ మృతి గురించి ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
సుశాంత్ సింగ్ రాజ్పుత్, దిశ సలియాన్ మరణాల కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత మూడు నెలలుగా ముంబై పోలీసులు, ఈడీ, సీబీఐ, ఎన్సీబీ లాంటి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. అయితే ఈ మరణాల వ్యవహారం బీజేపీ, శివసేన మధ్య పచ్చి గట్టివేస్తే భగ్గుమనేలా చేస్తున్నది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా జాతీయ ఛానెల్స్తో నితేష్ మాట్లాడుతూ.. తన మరణానికి ముందు ప్రాణభయంతో దిశ సలియాన్ 100 డయల్ చేసింది అని తెలిపారు. అయితే దిశ సలియాన్ కాల్ చేసినా పోలీసులు స్పందించలేరనే అనుమానాలను వ్యక్తం చేశారు. జూన్ 8వ తేదీన దిశ పాల్గొన్న పార్టీ వివాదంగా మారి ఆమె ప్రాణాలను హరించి వేసిందనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నది.
సుశాంత్ మృతికి ముందు రియా ఏం చేసిందంటే.. సీబీఐతో గుట్టువిప్పిన సిద్ధార్థ్ పితాని!
ఇదిలా ఉండగా, దిశ సలియాన్ 100 డయల్ చేసిన విషయాన్ని మహారాష్ట్ర హోం మంత్రి ముందు మీడియా ప్రస్తావించగా.. ఆయన సమాధానం దాటవేశారు. ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా తప్పించుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది.
జూన్ 8వ తేదీ అర్ధరాత్రి దిశ సలియాన్ ముంబైలోని మల్లాడ్లోని 14 అంతస్తుల భవనం నుంచి పడి ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఆమె మరణం తర్వాత దాదాపు 48 గంటల అనంతరం దిశ సలియాన్ పోస్టు మార్టమ్ చేయడం వివాదాస్పదమైంది.