Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సొనాలి బింద్రే మరణించింది.. బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్! అసలేం జరిగిందంటే..
Recommended Video
క్యాన్సర్ వ్యాధికి గురైన సొనాలి బింద్రే మరణించిందంటూ ట్వీట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్కు నెటిజన్లు చుక్కలు చూపించారు. దాంతో బీజేపీ ఇబ్బందిలో పడింది. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం రామ్ కదమ్కు తొలిసారి కాదు. గతంలో మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో కూరుకుపోయారు. తాజాగా సొనాలి బింద్రేపై వ్యాఖ్యలు చేసి బీజేపీకి తలవంపులు తెచ్చిపెట్టారు. ఇంకా ఏం జరిగిందంటే..
సొనాలి బింద్రే ఇకలేరంటూ
హిందీ, మరాఠీ చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకొన్న సొనాలి బింద్రే ఇకలేరు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో కన్నుమూశారు అనే వార్త సోషల్ మీడియాలో వచ్చిన సందేశాన్ని రామ్ కదమ్ షేర్ చేశాడు. అయితే ఆ వార్త నిజమా? వాస్తవమేంతా అనే విషయాన్ని పట్టించుకోలేకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది.
ఫేక్ న్యూస్ అని తేలడంతో
సొనాలి బింద్రే మరణ వార్తపై అభిమానులు ఆందోళన చెందారు. ఫేక్ న్యూస్ అని తేలడంతో నెటిజెన్స్ రామ్ కదమ్ను ట్రోల్స్ చీల్చి చెండాడారు. దాంతో అసలు విషయం తెలుసుకొన్న రామ్ కదమ్ తన తప్పుకు క్షమాపణ చెప్పారు. ఆయన తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.
రామ్ కదమ్ క్షమాపణ
సొనాలి బింద్రేపై వచ్చిన మరణ వార్త రూమర్. అందులో వాస్తవం లేదు. గత రెండు రోజులుగా నేను బాధలో మునిగిపోయాను. చేసిన తప్పుకు చింతిస్తున్నాను. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని రామ్ కదమ్ ట్వీట్ చేశారు.
సొనాలికి అమెరికాలో చికిత్స
సొనాలి బింద్రే ప్రస్తుతం అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొంటున్నారు. ఆమె వెంట భర్త గోల్డి బెహల్ ఉన్నారు. ఇటీవల ఆమె స్నేహితులు ప్రియాంకా చోప్రా తదితరులు కలుసుకొని నైతికంగా మద్దతు తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో వెల్లడిస్తున్నారు.