Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
20ఏళ్ల క్రితం నాటి కేసు: సన్నీ డియోల్, కరిష్మా కపూర్పై అభియోగాలు నమోదు
జైపూర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్, నటి కరిష్మా కపూర్లపై 20ఏళ్ల క్రితం నమోదైన కేసులో తాజాగా రైల్వే కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అనుమతి లేకుండా షూటింగ్ పేరుతో చైన్ లాగి రైలు ఆలస్యానికి కారణమయ్యారంటూ వారిపై ఈ మేరకు అభియోగాలు నమోదయ్యాయి.
రాజస్థాన్లోని అజ్మేర్ జిల్లా పులేరా సమీపంలో 1997లో 'భజ్రంగ్' సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్లో సన్నీ డియోల్, కరిష్మా కపూర్ ఇతర నటీనటులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాగా, ఆ సమయంలో సన్నీ డియోల్, కరిష్మా కపూర్, మరో ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నరేనా రైల్వే స్టేషన్లోకి వచ్చి 2413-U అప్లింక్ ఎక్స్ప్రెస్ చైన్ లాగారని అప్పటి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సీతారామన్ మలాకర్ వీరిపై రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ చర్య వల్ల రైలు 25 నిమిషాలు ఆలస్యమై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, ఈ కేసులో 2009లో రైల్వే కోర్టు.. సన్నీ డియోల్, కరిష్మా కపూర్, తదితరులపై అభియోగాలు నమోదు చేసింది.
ఆ తర్వాత వీరు సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. 2010 ఏప్రిల్ లో సెషన్స్ న్యాయస్థానం ఆ అభియోగాలను కొట్టివేసింది. అయితే తాజాగా, సెప్టెంబర్ 17న రైల్వే కోర్టు మరోసారి సన్నీ, కరిష్మాలపై అభియోగాలు మోపింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది రైల్వే కోర్టు.