Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
20ఏళ్ల క్రితం నాటి కేసు: సన్నీ డియోల్, కరిష్మా కపూర్పై అభియోగాలు నమోదు
జైపూర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్, నటి కరిష్మా కపూర్లపై 20ఏళ్ల క్రితం నమోదైన కేసులో తాజాగా రైల్వే కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అనుమతి లేకుండా షూటింగ్ పేరుతో చైన్ లాగి రైలు ఆలస్యానికి కారణమయ్యారంటూ వారిపై ఈ మేరకు అభియోగాలు నమోదయ్యాయి.
రాజస్థాన్లోని అజ్మేర్ జిల్లా పులేరా సమీపంలో 1997లో 'భజ్రంగ్' సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్లో సన్నీ డియోల్, కరిష్మా కపూర్ ఇతర నటీనటులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాగా, ఆ సమయంలో సన్నీ డియోల్, కరిష్మా కపూర్, మరో ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నరేనా రైల్వే స్టేషన్లోకి వచ్చి 2413-U అప్లింక్ ఎక్స్ప్రెస్ చైన్ లాగారని అప్పటి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సీతారామన్ మలాకర్ వీరిపై రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ చర్య వల్ల రైలు 25 నిమిషాలు ఆలస్యమై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, ఈ కేసులో 2009లో రైల్వే కోర్టు.. సన్నీ డియోల్, కరిష్మా కపూర్, తదితరులపై అభియోగాలు నమోదు చేసింది.
ఆ తర్వాత వీరు సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. 2010 ఏప్రిల్ లో సెషన్స్ న్యాయస్థానం ఆ అభియోగాలను కొట్టివేసింది. అయితే తాజాగా, సెప్టెంబర్ 17న రైల్వే కోర్టు మరోసారి సన్నీ, కరిష్మాలపై అభియోగాలు మోపింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది రైల్వే కోర్టు.