Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
20ఏళ్ల క్రితం నాటి కేసు: సన్నీ డియోల్, కరిష్మా కపూర్పై అభియోగాలు నమోదు
జైపూర్: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్, నటి కరిష్మా కపూర్లపై 20ఏళ్ల క్రితం నమోదైన కేసులో తాజాగా రైల్వే కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అనుమతి లేకుండా షూటింగ్ పేరుతో చైన్ లాగి రైలు ఆలస్యానికి కారణమయ్యారంటూ వారిపై ఈ మేరకు అభియోగాలు నమోదయ్యాయి.
రాజస్థాన్లోని అజ్మేర్ జిల్లా పులేరా సమీపంలో 1997లో 'భజ్రంగ్' సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్లో సన్నీ డియోల్, కరిష్మా కపూర్ ఇతర నటీనటులు, సిబ్బంది పాల్గొన్నారు.
కాగా, ఆ సమయంలో సన్నీ డియోల్, కరిష్మా కపూర్, మరో ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నరేనా రైల్వే స్టేషన్లోకి వచ్చి 2413-U అప్లింక్ ఎక్స్ప్రెస్ చైన్ లాగారని అప్పటి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సీతారామన్ మలాకర్ వీరిపై రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ చర్య వల్ల రైలు 25 నిమిషాలు ఆలస్యమై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, ఈ కేసులో 2009లో రైల్వే కోర్టు.. సన్నీ డియోల్, కరిష్మా కపూర్, తదితరులపై అభియోగాలు నమోదు చేసింది.
ఆ తర్వాత వీరు సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. 2010 ఏప్రిల్ లో సెషన్స్ న్యాయస్థానం ఆ అభియోగాలను కొట్టివేసింది. అయితే తాజాగా, సెప్టెంబర్ 17న రైల్వే కోర్టు మరోసారి సన్నీ, కరిష్మాలపై అభియోగాలు మోపింది. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది రైల్వే కోర్టు.