Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
వాహ్ బాద్షా.. మానవత్వాన్ని ప్రదర్శించిన షారుక్.. నాలుగు అంతస్థుల భవనాన్ని..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరోసారి మానవత్వాన్ని చాటుకొన్నారు. కరోనా సంక్షోభంలో దేశం కూరుకుపోయిన సమయంలో ప్రజల కోసం తాను ఉన్నానని నిరూపించారు. ఇప్పటికే ప్రధాని నిధికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించిన షారుక్.. కరోనా బారిన పడిన బాధితులను ఆదుకోనేందుకు నడుం బిగించారు. ప్రస్తుతం షారుక్ తీసుకొన్న నిర్ణయంపై పలు వర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
కరోనా సమయంలో
కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజల పక్షాన నిలిచారు. ఆరోగ్యపరమైన సేవ అందించే సామాజిక సంస్థలకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఇక్విప్మెంట్స్ను అందించారు. ఏక్సాథ్: ది ఎర్త్ ఫౌండేషన్, రోటి ఫౌండేషన్ అండ్ వర్కింగ్ పీపుల్స్ చార్టర్కు అండగా నిలిచారు. ఆయనతోపాటు భార్య గౌరీ ఖాన్ కూడా సేవ కార్యక్రమంలో తన వంతు సాయం అందిస్తున్నారు.
ఢిల్లీ, బెంగాల్ సీఎంలకు సహాయం
ఇవియే కాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా సహాయ కార్యక్రమంలో ఆర్థికంగాను, వైద్యపరమైన సేవలకు సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇలా కరోనా సంక్షోభ సమయంలో మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఆఫీస్ను క్వారంటైన్ ఫెసిలిటీగా
ఇదిలా ఉండగా, షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు తమ ఆఫీస్ను క్వారంటైన్ ఫెసిలిటీగా మలిచారు. నాలుగు అంతస్థుల కార్యాలయాన్ని కరోనా స్వీయ నిర్బంధ కేంద్రంగా ఉపయోగించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అప్పగించారు. ఈ ఆఫీస్లో చిన్నారులకు, మహిళలకు, పెద్దలకు సాయం అందించే దిశగా చర్యలు చేపట్టారు.
బీఎంసీ ట్వీట్ చేస్తూ..
షారుక్ ఖాన్ దంపతులు చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమంపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) స్పందిస్తూ.. కరోనాపై పోరాటానికి చేస్తున్న మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేశారు. వారి నాలుగు అంతస్తులు భవనాన్ని క్వారంటైన్ ఫెసిలిటిగా మలిచారు. అందుకు వారిద్దరికి థ్యాంక్స్ చెప్పుకొంటున్నాం అని అధికారులు పేర్కొన్నారు.
Recommended Video
|
షారుక్ స్పందించిన తీరు..
షారుక్ అప్పగించిన నాలుగు అంతస్థుల భవనంలో పిల్లలు, మహిళలు, పెద్దలకు ఆశ్రయం అందించేందుకు వీలు కలుగుతుంది. ఈ భవనంలో వారికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేశారు. సరైన సమయంలో బాధితులకు ఉపయోగ పడాలనే సేవా దృక్పథం మా హృదయాలను కరిగించింది. అంటూ అధికారులు ట్వీట్ చేశారు.