Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జియా ఖాన్ తల్లిపై సూరజ్ పంచోలి ఫ్యామిలీ ఫిర్యాదు
బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ మరణం వివాదం మరోసారి కోర్టు మెట్లెక్కింది. జియా ఖాన్ మరణం విషయంలో తమ కుటుంబాన్ని ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారంటూ సూరజ్ పంచోలి ఫ్యామిలీ సభ్యులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆదిత్య పంచోలి, జరీనా వాహబ్, సనా పంచోలి తాజాగా జియా ఖాన్ తల్లి రుబియా ఖాన్పై ఫిర్యాదు చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత తమ కుటుంబంపై జియా ఖాన్ తల్లి రుబియా ఖాన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2011 నుంచి 2015 మధ్యకాలంలో పంచోలిపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని బాంబే హైకోర్టు ఆదేశించింది. అలాంటి ఆదేశాలను తుంగలో తొక్కి రుబియా ఖాన్ అలాంటి ఆరోపణలే చేస్తున్నారు. రకరకాల ప్రెస్లో, సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేశారు.
జియా ఖాన్ మరణంపై ముంబై పోలీసులు, సీబీఐని రాజకీయ నేతలు మేనేజ్ చేశారు అంటూ ట్విట్టర్లో రుబియా ఖాన్ కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్లు మా కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి కామెంట్లను ఆపివేయాలి అంటూ ఆదిత్య పంచోలి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.