Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అక్షయ్ కుమార్ కుటుంబంలో విషాదం.. షాక్లో ఏక్తా కపూర్, బాలీవుడ్
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. అక్షయ్ కజిన్, టెలివిజన్ నటుడు, కహానీ ఘర్ ఘర్ కీ ఫేం సచిన్ కుమార్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఈ విషాద ఘటన లాక్డౌన్ కారణంగా ఆలస్యంగా మీడియాకు చేరింది. సచిన్ కుమార్ మృతికి పలువురు బాలీవుడ్, టెలివిజన్ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకొన్న సచిన్ కుమార్ మృతి గురించి..
నిద్రలోనే కన్నుమూసిన సచిన్
సచిన్ కుమార్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. అయితే అనుకోకుండా నటుడిగా మారారు. ఈ క్రమంలో మే 15వ తేదిన తన గదిలోకి వెళ్లి తలుపు బిగించుకొని పడకపై చేరిన ఆయన నిద్రలో మరణించారు. మరుసనటి రోజు డోర్ తీయకపోవడంతో పనిమనుషులు అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ వార్తను సచిన్ కుమార్ స్నేహితుడు రాకేష్ పాల్ మీడియాకు వెల్లడించారు.
సచిన్ మరణ వార్త తెలిసిన వెంటనే
సచిన్ మరణ వార్త తెలిసిన వెంటనే సచిన్ తల్లి, అక్షయ్ కుమార్ తన ఇంటికి చేరుకొన్నారు. హాస్పిటల్కు తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. లాక్డౌన్ ఆంక్షలను అనుసరించి సచిన్ అంత్యక్రియలు ముంబైలో ముగించారు. సచిన్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే చివరి వీడ్కోలు పలికారు.
రెండు రోజుల క్రితమే బర్త్ డే
అక్షయ్ కుమార్కు అత్యంత సన్నిహితుడైన సచిన్ కుమార్ రెండు రోజుల క్రితమే మే 13న జన్మదినం జరుపుకొన్నారు. ఆ తర్వాత రెండు రోజులకే సినీ పరిశ్రమను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తూ మరణించడంతో సన్నిహితులు దు:ఖంలో మునిగిపోయారు. ఈ వార్త తెలిసిన వెంటనే కహానీ ఘర్ ఘర్ కీ నిర్మాత ఏక్తా కపూర్ షాక్ గురయ్యారు.
అంత్యక్రియలకు ప్రముఖుల దూరం
సచిన్ మృతి ఆలస్యంగా తెలియడంతో పలువురు ఆయనకు శ్రద్దాంజలి ఘటించలేకపోయారు. ముంబైలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం వల్ల ప్రముఖులంతా సోషల్ మీడియాలోనే సంతాపం ప్రకటించారు. సచిన్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధించారు.
Recommended Video
సచిన్ కహానీ ఘర్ ఘర్ కీ.. ద్వారా
అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ సీరియల్ కహానీ ఘర్ ఘర్ కీ సీరియల్ ద్వారా సచిన్ నటుడిగా గుర్తింపు పొందారు. బాలీవుడ్లో లజ్జా అనే చిత్రంలో నటించారు. పలు చిత్రాల్లో కొన్ని పాత్రలు ధరించినా.. పెద్దగా గుర్తింపు దక్కకపోవడంతో తన ఫొటోగ్రఫి వృత్తికే పరిమితమయ్యారు. సచిన్ గొప్ప మానవతా దృక్పథం కలిగిన వ్యక్తి అని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.