Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రాణాలు పోతున్నాయి, ఇకనైనా మారండి.. మోడీ ప్రభుత్వంపై అనుపమ్ ఖేర్ షాకింగ్ కామెంట్స్!
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో మరింత బలంగా మారుతున్న విషయం తెలిసిందే. మరణాల సంఖ్య రోజురోజుకు మరింత ఎక్కువవ అవుతోంది. మరోవైపు పాజిటివ్ కేసులతో జనాలు ఆర్థికంగానే కాకుండా ఆకలి చావులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక గతంలో చాలాసార్లు నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈసారి కౌంటర్ ఇచ్చే విధంగా వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఏ స్థాయిలో వినాశనం క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అంటూ ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశంలో జరుగుతున్న పరిణామాలకు భారత ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సీనియర్ నటుడు తెలిపారు. దేశానికి ఎంత ఇమేజ్ క్రియేట్ చేస్తే ఏం లాభం అంటూ.. మనుషుల ప్రాణాలు కాపాడడం కంటే మరొక ముఖ్యమైన పని ఉండదని అన్నారు.
ఇప్పటికే ఎంతో మంది మరణించారు అంటూ.. ఇప్పటికైనా కనువిప్పు కలిగి ప్రభుత్వం పరిస్థితులను అర్థం చేసుకోవలసిన టైమ్ దగ్గర పడిందని అనుపమ్ ఖేర్ తెలిపారు. కోవిడ్ కారణంగా ప్రతి రోజు నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని 4లక్షల పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయని చెప్పారు.
ఇక ఆరోగ్య సంక్షోభాన్ని చక్కదిద్దడంలో లోపం అయితే ముమ్మాటిగా జరిగిందని విమర్శించిన అనుపమ్ ఖేర్.. ఇతర పార్టీలు ఈ విషాద విషయాలను సొంత ప్రయోజనం కోసం ఉపయోగించడం సరికాదని చెప్పారు. వీలైనంత త్వరగా ప్రజల పరిస్థితిపై ఒక అవగాహనకు వచ్చి జనాలను రక్షించాలని వివరణ ఇచ్చారు