Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అర్జున్ రాంపాల్ ఇంట్లో డ్రగ్స్ దందా.. నివాసంపై మెరుపుదాడులు.. 11న విచారణకు సమన్లు
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో బాలీవుడ్ సినీ ప్రముఖులపై నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రలో అధికారులు మరోసారి పంజా విసిరారు. కొద్ది రోజుల క్రితం దీపిక పదుకోన్ మేనేజర్కు సమన్లు జారీ చేసిన ఎన్సీబీ నవంబర్ 8వ తేదీ ఆదివారం ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియాద్వాలా భార్యను అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే సోమవారం ఉదయమే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నివాసంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెళ్లితే..
కొద్ది రోజుల క్రితం అర్జున్ రాంపాల్ బంధువు అరెస్ట్
కొద్ది రోజలు క్రితం అర్జున్ రాంపాల్ జీవిత భాగస్వామి గ్యాబ్రిలా డిమెట్రియాడెస్ ఎజిలిసిలాస్ సోదరుడు, దక్షిణాఫ్రికా పౌరుడు ఏజిసిలాస్ డిమెట్రియాడెస్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత సమన్లు జారీ చేసి అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ ఏజిలిసిలాస్ను కస్డడీలో విచారిస్తున్న ఎన్సీబీ అధికారుల కీలక సమాచారం లభించింది.
నైజీరియా డ్రగ్స్ సప్లయర్లతో సంబంధాు
ధర్మా ప్రొడక్షన్ మాజీ సిబ్బంది క్షితిజ్ ప్రసాద్, ఎజిసిలాస్ ఇద్దరు నైజీరియాకు చెందిన డ్రగ్స్ సప్లయిర్లతో సంబంధాలు ఉన్నాయనే విషయం తెలియగానే.. వాటిని నిర్ధారించుకొన్న తర్వాత సోమవారం అర్జున్ రాంపాల్ ఇంటిపై మెరుపుదాడులు చేశారు. ఉదయం7 గంటల సమయంలోనే ముంబైలోని అంధేరీ, ఖార్, బాంద్రా నివాసాల్లో ఏకకాలంలో దాడులు చేశారు.
ఏజిసిలాస్ డేమిట్రియాడ్స్ ఇచ్చిన సమాచారంతో
గతంలో ఏజిసిలాస్ డేమిట్రియాడ్స్ నివాసం నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఆ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశాం. అతడిని విచారించిన తర్వాత మరికొంత సమాచారం లభించింది. దాంతో మేము అర్జున్ రాంపాల్ నివాసంపై దాడుల చేశాం అని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే తెలిపారు. నవంబర్ 11వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశాం అని పేర్కొన్నారు.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై విచారణ చేపట్టిన సీబీఐ, ఈడీ సంస్థకు డ్రగ్స్ రాకెట్ కోణం బయటకు వచ్చింది. ఈ క్రమంలో రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో డ్రగ్స్ కోణంలో విచారణ చేపట్టిన తర్వాత బాలీవుడ్ తారలకు లింకులు ఉన్నాయనే విషయం వెల్లడి కావడంతో దీపికా పదుకోన్, సారా అలీ ఖాన్, శ్రద్దాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్కు సమన్లు జారీ చేసి విచారించారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొన్న తర్వాత బాలీవుడ్ ప్రముఖులపై ఎన్సీబీ కొరడా విసరుతున్నది.