Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రణ్బీర్ కపూర్కు కరోనా.. క్వారంటైన్లో ఆలియాభట్.. RRR షూటింగు పరిస్థితి ఏంటో!
మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్నది. కోవిడ్ 19 విజృంభిస్తున్న క్రమంలో మహా సర్కార్ ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్, కర్ఫ్యూలను విధించింది. కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే ఈ క్రమంలో సాధారణ జనంతోపాటు పలువురు సినీ హీరోలు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ యువ హీరో రణ్బీర్ సింగ్కు కరోనా పాజిటివ్ అనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే...
రణ్బీర్ కపూర్కు కరోనావైరస్
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్కు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం ముంబై మీడియాలో హల్చల్ రేపింది. అయితే రణ్బీర్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో గందరగోళం నెలకొన్నది. దాంతో రణ్బీర్ ఆరోగ్యంపై ఆయన తల్లి నీతూ కపూర్ క్లారిటీ ఇచ్చారు.
రణ్బీర్ తల్లి క్లారిటీ
రణ్బీర్ కపూర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అభిమానం కురిపించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. రణ్బీర్కు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. అతడికి వైద్య చికిత్స అందిస్తున్నాం. వైరస్ నుంచి వేగంగా కోలుకొంటున్నారు. ప్రస్తుతం ఇంటిలోనే క్వారంటైన్లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఆయన అభిమానులు కూడా ఆరోగ్యం ఉండాలని కోరుకొంటున్నారు అని నీతూ సింగ్ ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు.
రణ్బీర్ కపూర్ తల్లి కూడా
కొద్ది వారాల క్రితం రణ్బీర్ తల్లి, నటి నీతూ కపూర్ కూడా కరోనావైరస్ బారిన పడ్డారు. ఆమె నటిస్తున్న జగ్ జగ్ జీయో అనే చిత్ర షూటింగులో పాల్గొన్న సందర్భంగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అనే విషయం తేలింది. ఆ తర్వాత ఆమె కరోనావైరస్ను జయించారు.
క్వారంటైన్లో ఆలియాభట్
ఇదిలా ఉండగా, రణ్బీర్ కపూర్ కరోనావైరస్ బారిన పడగానే బాలీవుడ్ నటి ఆలియాభట్ కూడా క్వారంటైన్లోకి వెళ్లిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. గంగూభాయ్ కతియావాడి షూటింగులో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా సోకడంతో ఆలియా కూడా ఇంటిలో స్వీయ గృహ నిర్బంధాన్ని పాటిస్తున్నట్టు తెలిసింది.
RRR షూటింగుకు ఆలియాభట్
ఇటీవల రణ్బీర్ కపూర్, ఆలియాభట్ కూడా పలు పార్టీలో పాల్గొంటూ సన్నిహితంగా ఉన్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో కనిపించాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రణ్బీర్కు కరోనాసోకడంతో ఆలియాభట్ జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. అయితే RRR షూటింగుకు మార్చి 12వ తేదీన హాజరుకావాల్సి ఉన్న సమయంలో క్వారంటైన్లోకి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.