Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్ హీరో తల్లికి కరోనా వైరస్.. గృహ నిర్బంధంలో ప్రస్థానం హీరో
బాలీవుడ్లో వర్థమాన నటుడు సత్యజిత్ దూబే తల్లి కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సత్యజిత్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. ముంబైలో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో అభిమానులను జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం తన సోషల్ మీడియా పోస్టులో నా తల్లికి ఇటీవల నిర్వహించిన రోగ నిర్ధారణ పరీక్షల్లో కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ఆమె తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఒంటి నొప్పులతో ఆమె నరకాన్ని చూస్తున్నారు అని సత్యజిత్ తెలిపారు.
తన తల్లికి కరోనావైరస్ అని తెలిసిన తర్వాత ఆమెకు దూరంగా ఉండటం కష్టంగా మారింది. నేను, సోదరి ఇద్దరం గృహ నిర్బంధంలోనే ఉన్నాం. మాకు ఎలాంటి సమస్యలు లేవు. మాకు కరోనా లక్షణాలు ఏవీ లేవు. మా తల్లికి కరోనా ఉండటం కారణంగా అధికారులు సూచించిన మేరకు మేము క్వారంటైన్లో ఉన్నాం అని తెలిపారు.
ప్రతీ రోజు అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నాం. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మాకు మానసిక మద్దతు ఇచ్చిన ఇరుగు పొరుగు వారికి, మా సన్నిహితులకు రుణపడి ఉంటాం. ఇలాంటి భయంకరమైన కరోనా పరిస్థితుల్లో మాకు మానవత్వమేమిటో తెలిసి వచ్చింది. అని తెలిపారు.
బాలీవుడ్లో ఇటీవల రిలీజైన ప్రస్థానం సినిమాలో సత్యజిత్ దూబే నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, అలీ ఫైజల్, మనీషా కోయిరాలాతో కలిసి పోటాపోటీగా నటించారు. ప్రస్తుతం సత్యజిత్కు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా ద్వారా స్నేహితులు, సన్నిహితులు సపోర్ట్'గా నిలుస్తున్నారు.