Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డ్రగ్స్ కేసులో కమెడియన్కు ఊరట.. కోర్టు బెయిల్ మంజూరు
బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియాతో లింకుల వ్యవహారంలో అరెస్ట్ అయిన కమెడియన్ భారతీ సింగ్కు ఊరట లభించింది. శనివారం భారతీ సింగ్తోపాటు ఆమె భర్త హార్ష్ లింబాచియాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం భారతీ సింగ్ దంపతుల ఇంటిపై దాడి చేసి వారి నుంచి 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. వెంటనే వారికి సమన్లు జారీ చేసి ప్రశ్నించారు.
భారతీ సింగ్, హర్ష్ గంజాయి వినియోగించినట్టు అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని డిసెంబర్ 4వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.
తమను అరెస్ట్ చేయడంతో భారతీ సింగ్ దంపతులు ఆదివారం బెయిల్ కోసం కోర్టును సంప్రదించారు. వారి తరఫున న్యాయవాది అయాజ్ ఖాన్ వాదనలు వినిపించారు. వారిపై వచ్చిన ఆరోపణలు చాలా చిన్నవి. వాటి ఆధారంగా వేసిన కేసు పెద్దగా పట్టించుకోనవసరం లేదని వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించి బెయిల్ మంజూరు చేశారు.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్ వినియోగం, సరఫరా కేసులో పలువురిని ప్రశ్నించి అరెస్ట్ చేశారు. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రియాకు బెయిల్ లభించగా, షోవిక్కు ఇంకా బెయిల్ లభించడకపోవడం గమనార్హం.