Just In
Don't Miss!
- News
ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం .. స్పందించిన మంత్రులు నారాయణ స్వామి,ధర్మాన.. ఏమన్నారంటే
- Sports
India vs Australia: ఈ విజయం కుర్రాళ్లదే!
- Finance
రెండ్రోజుల నష్టం ఒక్కరోజులో: సెన్సెక్స్ 834 పాయింట్లు జంప్: రిలయన్స్ సహా హెవీవెయిట్స్ అదుర్స్
- Lifestyle
అల్లం తేనెలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్లిఫ్ట్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బొక్కాబోర్లా పడిన బాలీవుడ్.. దారుణమైన ఫ్లాపులతో అగ్రహీరోలు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనావైరస్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం, ఓటీటీలో రిలీజైన భారీ చిత్రాలు అతలాకుతలం చేశాయి. లాక్డౌన్ కారణంగా పలు చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే రిలీజ్కు భారీ అంచనాలను అందుకొన్న అగ్రహీరోలు, హీరోయిన్ల చిత్రాలు ప్రేక్షకుల మన్నలను అంందుకోలేక చితికలపడ్డాయి. ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని అవమానాన్ని చవిచూశాయి.
అలా బాలీవుడ్లో భారీ పరాజయం పొందిన చిత్రాల జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం సడక్ 2, అలియాభట్ నటించిన ఈ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత వచ్చిన ఈ చిత్రంపై అనేక ట్రోల్స్ జరిగాయి.

ఆ తర్వాత లవ్ ఆజ్కల్ చిత్రం దారుణమైన ఫ్లాప్ను మూటగట్టుకొన్నది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, సారా ఆలీ ఖాన్ జంటగా నటించారు. ఈ జంట కూడా ప్రేక్షకులను ఆలరించలేకపోయింది.
ఆ తర్వాత వచ్చిన ఖాళీ పీలీ చిత్రం కూడా బొక్కబోర్లా పడింది. ఏటీటీ మోడల్లో రిలీజైన ఈచిత్రం కాసులు పంటను పండించలేకపోయింది. ఇషాన్ కట్టర్, అనన్య పాండే కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేశారు.
లాక్డౌన్లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్ష్మి, దుర్గామతి ఘోరమైన రిజల్ట్ను సొంతం చేసుకొన్నాయి. ఓటీటీలో ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది.