Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చేయికలపొద్దు.. అదే చేయండి, అప్పుడే: సల్మాన్ ఖాన్
చైనాలో పుట్టి క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది కరోనా వైరస్. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి 3000 మందికి పైగా మరణించారు. ఇటీవలే భారత దేశంలో కూడా కరోనా కేసులు గుర్తించబడటం ఆందోళనకు గురిచేస్తుంది. ఈ విషయమై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పందిస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు వీలుగా ముందుజాగ్రత్త చర్యగా కరచాలనం బదులు సంప్రదాయబద్ధంగా 'నమస్తే' లేదా 'సలాం' చెప్పుకోవాలని సల్మాన్ ఖాన్ సూచించారు. జిమ్ లో వర్కవుట్స్ పూర్తయ్యాక తీరికగా కూర్చొని భారత సంప్రదాయం ప్రకారం రెండు చేతులు జోడించి ఫోటోకు పోజిచ్చారు సల్మాన్.
ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నమస్కారం చేయడం, సలాం చేయడం మన సభ్యతా, సంప్రదాయమని పేర్కొన్నారు. కరోనా వైరస్ తగ్గాక మనం చేతులు కలుపుదాం, కౌగిలించుకుందాం కానీ అప్పటిదాకా సలాం, నమస్తేలే ఫాలో అవుదాం అని సల్మాన్ ఖాన్ తెలిపారు. సల్మాన్ సుచన చూసి నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు.
మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కరోనా పట్ల స్పందిస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ సతీమణి ఉపాసన సహా సూపర్ స్టార్ మహేష్ బాబు, అఖిల్ అక్కినేని లాంటి తారలు కరోనా పట్ల భయాందోళనలు చెందొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పేర్కొంటూ ట్వీట్స్ చేశారు.