Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్లో సంచలన నిర్ణయం.. OTTలో ఏడుగురు స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలు..
కరోనావైరస్ లాక్డౌన్ పరిస్థితుల ప్రభావంతో బాలీవుడ్లో సంచలన నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఇప్పట్లో సినిమా హల్స్ తెరిచే అవకాశాలు లేకపోవడంతో నటీనటులు, నిర్మాతలు, దర్శకులు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ఫామ్స్పై రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకొంటున్నారు. ఈ క్రమంలోనే జూన్ 29వ తేదీన బాలీవుడ్లోని ఏడుగురు టాప్ హీరోల సినిమాల విషయంలో సంచలన నిర్ణయం జరిగింది. అదేమిటంటే..
స్టార్ హీరోల సినిమాలు
బాలీవుడ్లోని స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అలియాభట్, వరుణ్ ధావన్తో డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్రసిడెంట్ ఉదయశంకర్ తమ యాప్ హాట్స్టార్ లైవ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ సంబంధించిన బాలీవుడ్ కి హోమ్ డెలివరీ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. గతనెల ఏడు సినిమాలను డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ సంచలన నిర్ణయం తీసుకొన్న సంగతె తెలిసిందే. తాజాగా డిస్నీ + హాట్ స్టార్ కూడా అగ్ర హీరోలతో కూడిన భారీ బడ్జెట్ చిత్రాలను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఆ సినిమాలు ఏమిటంటే..
ఖుదా హాఫీజ్
విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించిన ఖుదా హాఫిజ్. ఫరూక్ కబీర్, దర్శకత్వం వహించగా, శివాలిక ఒబేరాయ్ హీరోయిన్గా నటించింది. అన్ను కపూర్, శివ్ పండిట్, నవాబ్ షా, ఆహానా కుమ్రా తదితరులు
లక్ష్మీ బాంబ్
అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్.. ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన కాంచన చిత్రానికి రీమేక్. వాస్తవానికి ఈ చిత్రం జూన్ 5న రిలీజ్ చేయాలని అనుకొన్నారు. కానీ కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.
సడక్ 2
1991లో
మహేష్
భట్
రూపొందించిన
సడక్
చిత్రానికి
ఇది
సీక్వెల్.
ఈ
చిత్రంలో
సంజయ్
దత్,
పూజాభట్
నటించారు.
తాజా
సీక్వెల్లో
ఆలియాభట్,
సంజయ్
దత్,
పూజా
భట్,
ఆదిత్య
రాయ్
కపూర్
నటించారు.
భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
1971లో జరిగిన ఇండో పాక్ యుద్దానికి సంబంధించిన చిత్రం. ఈచిత్రంలో అజయ్ దేవగన్ స్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ పాత్రలో నటించారు. సంజయ్ దత్, సోనాక్షి సిన్హా తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అభిషేక్ దుధైయా దర్శకత్వం వహించారు.
ది బిగ్ బుల్
అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం. స్టాక్ మార్కెట్ కుంభకోణంలో కీలక సూత్రధారి హర్షద్ మెహతా జీవితంపై సినిమా రూపొందినట్టు వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 23 తేదీన రూపొందించాలని నిర్ణయించారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
దిల్ బేచారా
సుశాంత్ సింగ్ రాజ్పుత్కు సంబంధించిన చివరి రిలీజ్ ఇది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూలై 24వ తేదీన డిస్టీ+హాట్స్టార్లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. సంజనా సంఘీ హిందీ చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చాబ్రా దర్శకుడిగా మారుతున్నారు.
Recommended Video
7వ చిత్రం లూట్ కేస్
కునాల్ ఖేము హీరోగా నటించారు. కామెడీ, ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం డిస్నీ+హాట్స్టార్ యాప్లో రిలీజ్ కానున్నది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న థియేటర్లలో రిలీజ్ చేయాలనుకొన్నారు. త్వరలోనే ఈ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించే అవకాశం ఉంది.