Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్టు.. గోవాలో సినీతారల గూడుపుఠాణి.. తెరపైకి సూపర్స్టార్లు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చిన డ్రగ్స్ కేసులో సంచలన విషయలు బయటకు వచ్చాయి. డ్రగ్ రాకెట్తో సినీ తారల సంబంధాలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూ్, రకుల్ ప్రీత్ సింగ్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసి విచారించడం సెన్సేషనల్గా మారింది. ఈ క్రమంలో గోవాలో సినీ తారలు చేసిన నిర్వాకాన్ని జాతీయ ఛానెల్ బయటపెట్టింది. గోవాలో కొద్ది రోజులుగా సినీ తారలు చేస్తున్న డ్రగ్స్ బండారాన్ని బయటకు లాగింది. ఆ వివారాల్లోకి వెళితే..
గోవాకు క్యూ కట్టిన సినీ తారలు
బాలీవుడ్తో డ్రగ్స్ రాకెట్ సంబంధాలపై ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్న సమయంలో బాలీవుడ్కు చెందిన పలువురు అగ్ర తారలు గోవాకు వెళ్లడం అందర్నీ ఆకర్షించింది. వరుసగా పలువురు హీరోయిన్లు, హీరోలు, దర్శకులు షూటింగుల పేరుతో గోవాకు వెళ్లారని, అయితే వారికి షూటింగులు లేవనే విషయాన్ని జాతీయ ఛానెల్ రిపబ్లిక్ బయటపెట్టింది.
విల్లాల్లో డ్రగ్స్కు విరుగుడు పరీక్షలు
గోవాలోని కొన్ని రిసార్టుల్లో డ్రగ్స్ వాడకం దారులకు విరుగుడుకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొన్నారనే విషయం బయటకు వచ్చింది. ఒకవేళ ఎన్సీబీ అధికారులు టెస్టులు నిర్వహిస్తే డ్రగ్స్ వాడిన విషయం బయటపడకుండా చికిత్స (డిటాక్స్) తీసుకొన్నట్టు స్పష్టమైంది. డ్రగ్స్ వాడకం విషయం బయటపడకుండా గోవాలో ప్రత్యేకమైన విల్లాల్లో చికిత్స పొందారు. అందుకు పలువురు తారలు ఏజెంట్ల సహాయం తీసుకొన్నారు అనే విషయాన్ని తమ కథనంలో వెల్లడించారు.
మరో 10 అగ్ర తారలకు నోటీసులు
ఇదిలా ఉండగా, రానున్న రోజుల్లో బాలీవుడ్కు చెందిన మరో 10 మంది నటీనటులను, నిర్మాతలను ఎన్సీబీ ప్రశ్నించనున్నట్టు సమాచారం. దీపిక, సారా, శ్రద్దా కపూర్ను విచారించిన తర్వాత నివేదికలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ఈ కేసులో ఫేజ్ 3 దర్యాప్తును మొదలుపెడుతారనే విషయాన్ని అధికారులు వెల్లడించినట్టు సమాచారం. త్వరలోనే వారికి సమన్లు జారీ చేస్తారని వెల్లడిస్తున్నారు.
Recommended Video
సూపర్స్టార్లకు డ్రగ్స్ రాకెట్తో సంబంధాలు
మూడో ఫేజ్ విచారణలో సూపర్స్టార్లను విచారిస్తారు. దీపిక, సారా, శ్రద్దా కంటే స్టార్ స్టేటస్ ఉన్న నటులు డ్రగ్స్ రాకెట్తో సంబంధాలు పెట్టుకొన్నారు. వారికి సమన్లు త్వరలో జారీ చేస్తారు అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. క్వాన్ మాజీ ప్రతినిధి క్షితిజ్ రవి ప్రసాద్ విచారణ సమయంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి.