Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జాన్వీ ఇంటికి వస్తున్న సీక్రెట్ లవర్.. ఆమె ఎఫైర్పై బోనీకపూర్ కీలక వ్యాఖ్యలు
Recommended Video
జాన్వీ కపూర్.. పేరుకు శ్రీదేవి కూతురే అయినా.. తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తల్లికున్న ఫాలోయింగ్తో నెగ్గుకు రావడం కష్టమని భావిస్తున్న ఈ బ్యూటీ.. స్వతహాగా ఎదగాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటోంది. అందం ఉన్నా నటనలో ఇంకా మెరుగు పడాలన్న కసితో పని చేస్తోంది. ఈ క్రమంలోనే డేటింగులు.. ఎఫైర్స్ అంటూ తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా వీటిపై ఆమె తండ్రి బోనీ కపూర్ స్పందించారు.
మొదటి సినిమాతోనే మెప్పించింది
జాన్వీ కపూర్ - ఇషాన్ ఖట్టర్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘ధడక్' మంచి విజయం సాధించింది. ప్యూర్ లవ్ జోనర్లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో పాటు భారీ కలెక్షన్లనూ రాబట్టింది. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ క్రమంలోనే మరికొన్ని చిత్రాలకు సంతకాలు చేసింది.
తరచూ వార్తల్లోకి..
తల్లి బతికున్నప్పుడే తన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది జాన్వీ కపూర్. ఆమె డ్రెస్సింగ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్, వీడియోలు ఇలా ప్రతి విషయం బీ టౌన్లో హైలైట్ అయ్యేది. దీంతో అమ్మడు సినిమాల్లోకి రాకముందే భారీ పాపులారిటీ సంపాదించుకుంది.
భారీ ఫ్యాన్ ఫాలోయింగ్
పేరుకు శ్రీదేవి కూతురే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడంతో జాహ్నవికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె సినిమా విడుదలవక ముందే జాహ్నవి పేరిట ఎన్నో ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాదు, ఆమె ఎక్కడ షూటింగ్ చేస్తున్నా.. సదరు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అక్కడకు వాలిపోతున్నారట. గతంలో తన ఫ్యాన్స్ వల్లే జాహ్నవి ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి.
ఇషాన్తో డేటింగ్ అంటూ వార్తలు
‘ధడక్'లో తనతో పాటు నటించిన ఇషాన్తో జాన్వీ కపూర్ డేటింగ్లో ఉందని బాలీవుడ్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరూ తరచూ రహస్యంగా కలుస్తున్నారని అనుకుంటున్నారు. అంతేకాదు, ఈ మధ్య వీళ్లిద్దరూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనేది ప్రస్తుతం బీ టౌన్లో హాట్ టాపిక్ అయింది.
ఎఫైర్ వార్తలపై బోనీ కపూర్ స్పందన
తన కూతురికి ఇషాన్తో ఎఫైర్ ఉందని వస్తున్న వార్తలపై బోనీ కపూర్ స్పందించారు. ‘‘జాన్వీ, ఇషాన్ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు అవాస్తవం. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. అందుకే వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధాన్ని నేను గౌరవిస్తాను. ఇషాన్ మా ఇంటికి వస్తాడన్న వార్తల్లో నిజం లేదు. ‘ధడక్' విడుదలయ్యాక ఇషాన్.. ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు'' అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం చేస్తున్న సినిమా
జాహ్నవి కపూర్ ప్రస్తుతం ‘రూహీ అఫ్జా' అనే సినిమా చేస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీనితో పాటు ‘దోస్తానా 2'లో కూడా నటిస్తోంది.