Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జాన్ నిన్ను ప్రతీ క్షణం మిస్ అవుతున్నా .. శ్రీదేవిపై బోనీ కపూర్ ఎమోషనల్
స్వర్గీయ శ్రీదేవీ, అతిలోక సుందరి జయంతి నేడు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులంతా శ్రీదేవీని స్మరించుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సెలెబ్రిటీలంతా శ్రీదేవిని తలుచుకుంటున్నారు. ఎక్కడో తమిళనాడులో పుట్టి ఇండియన్ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవీ బోనీకపూర్ను పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవీ మరణం మాత్రం ఎందరిలోనో మనో వేదనను మిగిల్చింది. నేడు శ్రీదేవీ జయంతి కావడంతో అందరూ ఎమోషనల్ అవుతున్నారు.
విడిచివెళ్లిన శ్రీదేవి..
శ్రీదేవీ ప్రమాదవశాత్తు బాత్ టబ్లో పడిపోయి చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దుబాయ్లో ఓ పెళ్లికి వెళ్లిన శ్రీదేవీ తన హోటల్ రూంలో ప్రమాదవశాత్తు మరణించింది. 2018 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లింది. అయితే తన కూతురు జాన్వీ కపూర్ను తెరపై చూడాలన్న కల నెరవేరకుండానే మరణించింది.
పలు సందర్భాల్లో..
శ్రీదేవి దూరమైన తరువాత బోనీ కపూర్ పలు సందర్భాల్లో ఎమోషనల్ అయ్యారు. మామ్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా శ్రీదేవికి అవార్డు లభించడం, దాన్ని బోనీ కపూర్ అందుకున్న సమయంలో ఎమోషనల్ అయి కంటతడి పెట్టాడు. ఇక పిల్లలు (జాన్వీ, ఖుషీ కపూర్) కూడా పలు సందర్భాల్లో శ్రీదేవిని తలుచుకుని కన్నీరుపెట్టారు.
ప్రతీ క్షణం మిస్ అవుతున్నా..
నేటి జయంతి సందర్భంగా బోనీ కపూర్ స్పందిస్తూ.. ‘మమ్మల్ని విడిచి వెళ్లిన ఈ తొమ్మిది వందల రోజుల్లో ప్రతీ క్షణం నిన్ను మిస్ అయ్యాను జాన్.. అయితే ఈ రోజు మరింత మిస్ అవుతున్నా.. మన జాను గుంజన్ సక్సేనా చిత్రంలో నటించిన తీరును నువ్ చూస్తే నీ మొహంలో వచ్చే చిరునవ్వును మిస్ అవుతున్నాం. నువ్ మాతో పాటే ఉన్నావని అనుకుంటున్నాను. నువు లేకపోతే మా సంతోషం అర్దరహితమే. హ్యాపీ బర్త్ డే మై లవ్ మై లైఫ్' అంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఐ లవ్యూ మమ్మా..
ఇక కూతురు జాన్వీని హీరోయిన్గా వెండితెరపై చూద్దామని ఎంతో కలలు కన్న శ్రీదేవీ ఆ కోరిక తీరకుండానే తనువు చాలించింది. అయితే ధడక్ చిత్రం షూటింగ్ చేస్తుండగా శ్రీదేవి జీవించేఉంది. ఇక జాన్వీకి శ్రీదేవీ అంటే ఎంత ప్రేమో ఆమె షేర్ చేసే ఫోటోలు, చెప్పే మాటల్లోనే తెలుస్తుంది. నేడు శ్రీదేవి జయంతి సందర్భంగా తల్లితో దిగిన ఓ పాత ఫోటోను షేర్ చేస్తూ ఐ లవ్యూ మమ్మా అంటూ సింపుల్గా ప్రేమను చాటింది.
దర్శకేంద్రుడు కూడా..
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, శ్రీదేవీ కాంబినేషన్ అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీనే. తెలుగులో వీరికాంబోలో ఎన్నో మధురమైన చిత్రాలు వచ్చాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి మాత్రం చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం నిలిచిపోతుంది. శ్రీదేవీ జయంతి సందర్భంగా.. ‘అతిలోక సుందరి శ్రీదేవి జయంతి నేడు... మా అందరి హృదయాల్లో చిరకాలం నీ స్థానం పదిలం' అంటూ దర్శకేంద్రుడు ఎమోషనల్ అయ్యాడు.