Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ మూడు శ్రీదేవి కోసమేనా.. ఆసక్తి కలిగిస్తున్న బోనీ కపూర్ నిర్ణయం!
శ్రీదేవి మరణం యావత్ భారతానికి షాక్ అని చెప్పొచ్చు. అప్పటి వరకు చలాకీగా తిరిగిన శ్రీదేవి.. ఆకస్మికంగా మరణించిందనే వార్త తెలియడంతో అంతా షాక్ కి గురయ్యారు. శ్రీదేవి కుటుంబం పరిస్థితి అయితే ఇక చెప్పలేం. దాదాపు మూడు రోజుల హైడ్రామా అనంతరం శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. కాగా శ్రీదేవి మరణం నుంచి ఆమె కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
శ్రీదేవి మరణం తరువాత ఆమె బయోపిక్ గురించి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. హీరోయిన్ గా శ్రీదేవికి ఉన్న ట్రాక్ రికార్డ్ మరే నటికి ఉండదేమో. ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలో శ్రీదేవి విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. దక్షణాది వారు రాణించడం కష్టమైన బాలీవుడ్ లో సైతం శ్రీదేవి విజయ బావుటా ఎగరవేసింది.
అలాంటి శ్రీదేవి జీవిత గాదని వెండితెరపై ఆవిష్కరించాలనే కోరిక చాలా మంది సినీ ప్రముఖుల మదిలో ఉంది. కానీ ఆ బాధ్యతని బోనీ కపూర్ భుజాలపైకి ఎత్తుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూడు ఆసక్తికరమైన టైటిల్స్ ని బోనీ కపూర్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. శ్రీ, శ్రీదేవి, శ్రీ మామ్ అనే టైటిల్స్ ని బోనికపూర్ రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్స్ శ్రీదేవి బయో పిక్ కోసమే అనే వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి బయోపిక్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.