Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సుశాంత్ను చంపేసి ఫ్యాన్కు ఉరి తీశారా? సీబీఐ ముందు మరో అనుమానం
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు ఊపిరి సలపని విధంగా విచారణ జరుపుతున్నారు. దాదాపు ఐదారు బృందాలుగా విడిపోయిన అధికారులు పలు కోణాల్లో కేసుపై దృష్టిపెట్టారు. ఆదివారం బాంద్రాలోని సుశాంత్ నివాసంలో డెత్ సీన్ రీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత పలు విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ విషయాలు ఏమిటంటే..
Recommended Video
బెడ్కు ఫ్యాన్కు మధ్య పొడవు
సుశాంత్ ఇంటిలో డెత్ సీన్ రీ క్రియేషన్ తర్వాత పడకకు సీలింగ్కు ఉన్న ఫ్యాన్ మధ్య దూరాన్ని అంచనా వేసినట్టు సమాచారం. అయితే సుశాంత్ దేహానికి పైన, కింద ఉన్న బెడ్ మధ్య ఉన్న పొడవుపై కీలకంగా దృష్టిపెట్టి పలు విషయాలను పరిశీలించినట్టు సమాచారం. ఎందుకంటే సుశాంత్ పొడవుపై కొన్ని అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సుశాంత్ పొడవుపై అనేక అనుమానాలు
సుశాంత్ ఓ ఇంటర్వ్యూలో తన పొడవు 6 ఫీట్లు అని స్పష్టంగా చెప్పారు. అయితే మరణం తర్వాత సుశాంత్ పొడవు కేవలం 5.10 ఫీట్లు అనే వాదన తెరపైకి వచ్చింది. ఇలాంటి భిన్నవాదనల మధ్య సీబీఐ అధికారులు చేసే దర్యాప్తుపై విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది.
స్వయంగా ఉరివేసుకొన్నారా? లేదా వేరే ఎవరైనా?
ఇక సీబీఐ అధికారులు తమ విచారణలో అనేక సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. తనకు తాను ఫ్యానుకు సుశాంత్ ఉరివేసుకొన్నాడా? లేదా అపస్మారక స్థితిలోకి జరుకొన్న తర్వాత ఎవరైనా ఫ్యానుకు సుశాంత్ను వేలాడ దీశారా అనే ప్రశ్నలపై అధికారులు దృష్టిపెట్టినట్టు సమాచారం.
ఎయిమ్స్ వైద్యుల పరిశీలన
సుశాంత్ మరణంపై వాస్తవాలు రాబట్టడానికి ప్రస్తుతం డాక్టర్ సుధీర్ గుప్తాతో కూడిన ఎయిమ్స్ వైద్య బృందం విసేరా రిపోర్టులు, పోస్టు మార్టమ్ రిపోర్టులను పరిశీలిస్తున్నది. ఆ రిపోర్టుల్లో వెల్లడయ్యే అంశాలపైనే సిబీఐ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ముంబై పోలీసులు నుంచి సేకరించిన ఫొరెన్సిక్ రిపోర్టుల్లో స్పష్టత లేకపోవడం వల్ల రెండో ఒపీనియన్కు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.
మరోసారి పితాని, నీరజ్ను ప్రశ్నిస్తున్న సీబీఐ
ఇలాంటి పరిస్థితుల మధ్య సుశాంత్ కేసు దర్యాప్తులో సిబీఐ అధికారుల ముందు అనేక సవాళ్లు నిలుస్తున్నాయి. ఈ క్రమంలో వంట మనిషి నీరజ్, స్నేహితుడు సిద్ధార్థ్ పితానిని మరోసారి సీబీఐ విచారిస్తున్నది. అలాగే రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా సీబీఐ అధికారులు సోమవారం విచారణకు పిలిచి ప్రశ్నిస్తున్నారు.