Don't Miss!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నువ్వు బ్రతికుంటే నేనే చంపేస్తా : అక్షయ్ కుమార్పై భార్య ఫైర్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముంబైలో జరిగిన ఓ ఈవెంటులో తన ఒంటికి నిప్పంటించుకోవడంతో అభిమానులు కంగారు పడిపోయారు. నిపుణుల సమక్షంలో పూర్తి సేఫ్టీ వాతావరణంలో అక్షయ్ ఈ స్టంట్ చేసినప్పటికీ ఏమైనా తేడా వస్తే ఎలా? అనే ఆందోళన అందరిలోనూ ఏర్పడింది. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే... కుటుంబ సభ్యులు ఏ స్థాయిలో కంగారుపడిపోతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అక్షయ్ కుమార్ ఈ స్టంట్ చేస్తున్న విషయం భార్య ట్వింకిల్ ఖన్నాకు ముందుగా చెప్పలేదట. ట్విట్టర్లో ఫోటోలు, వీడియోలు చూసి ట్వింకిల్ ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే తన కోపాన్ని ట్వీట్ రూపంలో వెల్లగక్కింది.
ఇంటికిరా నేనే చంపేస్తా
‘‘నువ్వు ఇలాంటి చెత్త పని చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నీ ఒంటికి నువ్వే నిప్పంటించుకుంటావా? ఇలాంటి పని ఎవరైనా చేస్తారా? ఇంటికి రా నీ సంగతి చెబుతా.. అప్పటికీ నువ్వు బ్రతికి ఉంటే నేనే నిన్ను చంపేస్తా.'' అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేశారు. దేవుడా నువ్వే నాకు ఈ విషయంలో హెల్ప్ చేయాలి అనే యాష్ ట్యాగ్ ఈ సందర్భంగా తన పోస్టుకు యాడ్ చేయడం గమనార్హం.
నేను కూడా అదే భయపడుతున్నా...
ట్వింకిల్ ఖన్నా ట్వీట్ మీద అక్షయ్ కుమార్ రియాక్ట్ అయ్యారు. ‘‘ఆ స్టంట్ చేసినప్పటి నుంచి నాకూ అదే భయం పట్టుకుంది. ఇంటికి వచ్చాక నువ్వు ఏం చేస్తావో అని'' అంటూ రిప్లై ఇచ్చారు. ఈ భార్య భర్తల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ది ఎండ్
‘అమేజాన్ ప్రైవ్ వీడియో' అనే ఆన్లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం కోసం అక్షయ్ కుమార్ ‘ది ఎండ్' అనే వెబ్ సిరీస్ చేయబోతున్నారు. అక్షయ్ చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇది. అందుకే ఈ లాంచింగ్ ఈవెంటును గ్రాండ్గా నిర్వహించారు. అందులో భాగంగానే అక్షయ్ ఈ ఫైర్ స్టంట్ చేశారు.
కేసరి
అక్షయ్ కుమార్ త్వరలో ‘కేసరి' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం మార్చి 21న విడుదల కాబోతోంది. దీంతో పాటు మిషన్ మంగల్, గుడ్ న్యూస్, హౌస్ ఫుల్ 4, సూర్యవంశి చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు.