Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్ సినిమాపై కరోనా ఎఫెక్ట్: అదిరిపోయే ప్లాన్ చేసిన ‘ఆదిపురుష్’ యూనిట్
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. చారిత్రాత్మక చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమా.. రామాయణం నాటి కథతో వస్తోంది. పాన్ ఇండియా రేంజ్తో ఐదు భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ భారీ స్థాయిలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువవుతోన్న నేపథ్యంలో దీనిపై భారీగా ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అదిరిపోయే ప్లాన్ రెడీ చేసుకున్నట్లు ఓ న్యూస్ లీకైంది.
ముంబై నగరంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ల విషయంలో పరిమితులు విధించే పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' టీమ్ షూటింగ్ స్పాట్కు కేవలం 24 మంది సభ్యులనే అనుమతించినట్లు తెలుస్తోంది. అంతకు మించి ఒక్క వ్యక్తిని కూడా చిత్రీకరణ ప్రదేశానికి అనుమతించకుండా ప్లాన్ చేసుకున్నట్లు బీ టౌన్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగానే చిన్న చిన్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే.. వీఎఫ్ఎక్స్ వర్క్స్ పార్టును కొనసాగించి, షూటింగ్ ఆపేసే అవకాశం కూడా ఉందని సమాచారం.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' షూటింగ్ ముంబై నగర శివారులోని మధ ద్వీపంలో జరుగుతోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ సహా పలువురు కీలక నటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక, ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్తో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ రావణుడిగా చేస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు.