Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఎటు చూసినా ఎడారే, నరకం లాంటి అనుభవం: ఫారిన్లో కరోనా భయంతో గాయని
బాలీవుడ్ సింగర్ నీతి మోహన్ విహారయాత్ర కరోనావైరస్ కారణంగా భయంకరమైన అనుభవంగా మిగిలింది. కరోనావైరస్ ముప్పు బయటకు రావడానికి కొద్ది రోజుల ముందు తన భర్త, తన చెల్లెల్లతో ఆస్ట్రేలియా టూర్కు వెళ్లింది. అయితే కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నదనే వార్తలతో విహారయాత్రను ముగించుకొని మధ్యలోనే భారత్కు వచ్చారు. ఈక్రమంలో ఆమెకు ఎదురైన భయంకరమైన అనుభవాలను మీడియాతో పంచుకొన్నారు.
కరోనావైరస్ వార్తలతో భయంతో
ఆస్ట్రేలియాలో
మా
విహారయాత్ర
ఆనందంగా
సాగుతున్నది.
ఆ
సమయంలోనే
కరోనావైరస్
వార్తలు,
వ్యాధిగ్రస్తుల
గుర్తింపు
సంఖ్య
అనూహ్యంగా
పెరిగిపోయింది.
ఆ
సమయంలోనే
ఆస్ట్రేలియాలో
షూటింగ్
చేస్తున్న
హాలీవుడ్
నటుడు
టామ్
హాంక్స్
దంపతులు
కరోనావైరస్
బారిన
పడ్డారనే
వార్తలతో
ఆందోళన
మొదలైంది
అని
నీతి
మోహన్
పేర్కొన్నారు.
అర్ధాంతరంగా ఇండియాకు
ఆస్ట్రేలియాలో పరిస్థితులు దారుణంగా మారుతుంటే వెంటనే ఇండియాకు వెళ్లాలనే నిర్ణయం తీసుకొన్నాం. ఇక అక్కడే ఉంటే కరోనా బారిన పడే అవకాశం ఉందనే భయం మొదలైంది. నా తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో స్వదేశానికి తిరుగుముఖం పట్టాం అని నీతిమోహన్ తెలిపారు.
ప్రయాణంలో నరకంగా
వాస్తవానికి మార్చి 17వ తేదీన భారత్కు రావాల్సి ఉంటే.. పర్యటను అర్ధాంతరంగా వాయిదా వేసుకొని మార్చి 12నే ఇండియాకు వచ్చేశాం. ఇక ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చే క్రమంలో నరకాన్ని అనుభవించాం. మేము సింగపూర్ నుంచి దుబాయ్ మీదుగా ఇండియాకు వచ్చాం. మా తిరుగు ప్రయాణం జీవితంలోనే అత్యంత దారుణం అని నీతి మోహన్ చెప్పారు.
ఎయిర్పోర్టులన్నీ ఎడారులుగా
సింగపూర్, దుబాయ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎయిర్పోర్టులన్నీ ఎడారులుగా మారాయి. ఎటూ చూసినా చాలా ఖాళీగా ఉన్నాయి. ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ త్వరగా ముగిసిపోయింది. ఎప్పుడూ కిటకిటలాడే ప్రదేశాలు బోసిపోయి ఉన్నాయి. అలాంటి పరిస్తితి చూస్తే మా ప్రాణాలకు ముప్పు తప్పదేమో అనే ఫీలింగ్ కలిగింది అని నీతి మోహన్ చెప్పింది.
Recommended Video
స్వీయ గృహ నిర్భంధంలో
ఇండియాకు
వచ్చిన
వెంటనే
పుణేలోని
తమ
ఫామ్
హౌస్లో
స్వీయ
గృహనిర్భంధంలోకి
వెళ్లాను.
ఆ
తర్వాత
కేంద్ర
లాక్డౌన్
ప్రకటించింది.
తాము
పర్యటనను
అర్ధాంతరంగా
వాయిదా
వేసుకొని
రావడం
మంచి
పని
అనే
ఫీలింగ్
కలిగింది.
ఏప్రిల్
14
వరకు
మేము
పుణెలో
ఉండాలని
నిర్ణయించుకొన్నాం
అని
నీతి
మోహన్
చెప్పారు.