Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పుల్వామా వీరులకు నివాళి అర్పిస్తూ బాలీవుడ్ స్టార్స్ సాంగ్
జమ్మూ కశ్మీర్లో ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఈ బాంబు దాడిలో దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఎటాక్ తర్వాత దేశంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిభిరాలపై బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
ఈ దాడిలో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ 'తూ దేశ్ మేరా' అనే దేశభక్తి పాటను చిత్రీకరించారు. ఇందులో బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, అమీర్ ఖాన్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్, రణబీర్ కపూర్ నటించారు.
Official Poster of the Tribute Song for #CRPF Martyrs of Pulwama #TuDeshMera by @HAPPYPRODINDIA
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) August 14, 2019
Bollywood comes together to pay homage to the Pulwama Martyrs of #CRPF
Thanks @SrBachchan @iamsrk @aamir_khan @TheAaryanKartik @iTIGERSHROFF #Ranbirkapoor #AishwaryaRai pic.twitter.com/OPLrNfz8Ia
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) ఈ పాటను పుల్వామా దాడిలో మృతి చెందిన సైనికులకు నివాళి అర్పిస్తూ అంకితం చేయనున్నారు. బుధవారం ఈ పోస్టర్ విడుదలైంది. ఆగస్టు 15న ఈ వీడియో సాంగ్ విడుదల చేయబోతున్నారు.
'తు దేశ్ మేరా' అంటూ సాగే ఈ దేశ భక్తి పాటను ప్రముఖ సింగర్లు జావేద్ అలీ, జుబిన్ నూతియాల్, షబాబ్ శబ్రి, కబీర్ సింగ్ ఆలకించారు. వీర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సాగే ఈ సాంగులో భాగం కావడంపై సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేశారు.