Don't Miss!
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ధ్వంసమైన అజయ్ దేవగన్ ‘మైదాన్’ సెట్.. బోనికపూర్కు 30 కోట్ల నష్టం!
తౌక్తే తుఫాన్ విరుచుకుపడటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ తుఫాన్ ప్రభావం సినిమా పరిశ్రమపై కూడా భారీగా పడింది. ప్రముఖ నిర్మాత బోనికపూర్పై ఈ నష్ట ప్రభావం ఎక్కువగానే కనిపించింది.
అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న మైదాన్ చిత్రం కోసం భారీ సెట్ను ముంబైలో వేశారు. అయితే తౌక్తే తుఫాన్ దాటికి ఆ సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో బోనికపూర్ మాట్లాడుతూ.. మైదాన్ కోసం వేసిన సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ సినిమా కోసం ఆ సెట్ను వేయడం ఇది మూడోసారి అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
మొదటి లాక్డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్ను తొలిసారి కూలగొట్టాం. ఆ తర్వాత మళ్లీ రెండోసారి సెట్ వేసి చిత్రీకరించాం. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మరోసారి సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌక్తే తుఫాన్ ధాటికి మళ్లీ సెట్ అంతా తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది అని బోనికపూర్ చెప్పారు.
మైదాన్ చిత్రాన్ని ఓటీటీలోను, థియేటర్లోను ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారనే వార్తలను కొట్టిపడేశారు. నా సినిమాలను కేవలం థియేటర్లోనే రిలీజ్ చేస్తాను. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా నడుస్తున్నాయి అంటూ వివరణ ఇచ్చారు. డిజిటల్ ఫ్లాట్ఫాంలో పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తారనే ప్రచారం బాలీవుడ్ మీడియాలో జరిగింది.