Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2020లో సోషల్ మీడియా రచ్చ.. ఆ స్టార్స్కు చుక్కలు చూపించిన నెటిజన్స్
2020లో సోషల్ మీడియా ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. అయితే కొందరికి మాత్రం సోషల్ మీడియా చుక్కలు చూపించింది. ఈ ఏడాది మొత్తంలో బాలీవుడ్ ఎదుర్కొన్నంతగా ట్రోలింగ్ మరేతర ఇండస్ట్రీ ఎదర్కొలేదు. సుశాంత్ సింగ్ మరణించిన తరువాత బాలీవుడ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. స్టార్ హీరో, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లందరూ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా ధాటికి కొందరు బెదిరిపోయారు.
అలా తమపై వచ్చిన నెపోటిజం ఆరోపణలు, సుశాంత్ సింగ్ కేసులోకి తమ పేర్లను లాగడం ఎంతో మంది స్టార్స్ తెగ ఇబ్బంది పడ్డారు. సోషల్ మీడియాలో రోజుకో స్టార్ హీరోను టార్గెట్ చేశారు. చివరకు సల్మాన్ ఖాన్ను కూడా ఏకిపారేశారు. ఇక కరణ్ జోహర్ వంటి నిర్మాతను దారుణంగా అవమానించారు. నెపోటిజాన్ని పెంచి పోషించాడంటూ రచ్చ రచ్చ చేశారు నెటిజన్లు. పాత వీడియోలను బయటకు తీసి కరణ్ జోహర్ ప్రైవేట్ పార్టీల గుట్టు విప్పారు.
ఇక డగ్స్ కేసులో విచారణకు హాజరైన దీపికా పదుకొణెను అప్పట్లో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ప్రశ్నలు అడుగుతుండటంతో దీపిక ఏడ్వడం ప్రారంభించిందని.. సుశాంత్, డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి బలైపోయింది. మోస్ట్ హెటెట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని ప్రకటిస్తే రియా చక్రవర్తిని వెళ్లే అంతగా నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ మధ్య రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ మీద విడుదల అవ్వడంతో మరోసారి డ్రగ్స్ కేసు వార్తల్లోకి వచ్చింది.