Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ద్రౌపదిగా దీపికా పదుకోన్.. 1000 కోట్ల భారీ ప్రాజెక్ట్లో..
మహాభారతం చిత్రాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ఖాన్ స్పీడ్ పెంచారు. మహాభారతాన్ని సినిమాగా తీయాలని కొద్ది రోజుల క్రితం తన మనసులో మాటను బయటపెట్టిన సంగతి తెలిసిందే. సుమారు రూ.1000 కోట్లతో ఈ సినిమాను భారీగా రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ చిత్రానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ భాషలకు చెందిన అగ్ర నటులతో ఈ సినిమాను రూపొందించేందుకు ముందుకెళ్తున్నట్టు బాలీవుడ్ మీడియా కథనం.
మహాభారతంలోని కీలక పాత్ర ద్రౌపది కోసం బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొన్ను సంప్రదించినట్టు సమాచారం. వివాదాస్పద చిత్రం పద్మావతిలో తనదైన రీతిలో రాణించిన దీపిక ఈ పాత్రకు సరైనదనే నిర్ణయానికి అమీర్ఖాన్ వచ్చినట్టు సమాచారం. అయితే ద్రౌపది పాత్రకు దీపిక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది కొద్ది రోజులు ఆగితే స్పష్టత రావడం ఖాయం.
ఇప్పటివరకు అమీర్ఖాన్, దీపిక కలిసి పనిచేయలేదు. ఒకవేళ మహాభారతం కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తే సెన్సేషనల్ ప్రాజెక్ట్ అయ్యేది గ్యారంటీ అని చెబుతున్నారు.