దీపిక పదుకోన్ పిరికిదానిలా పారిపోయింది.. ట్రోల్స్కు షాకిస్తూ డైరీని బయటపెట్టిన బ్యూటీ
కొత్త సంవత్సరం ఆరంభానికి ముందు అభిమానులకు, సోషల్ మీడియా ఫాలోవర్స్కు గట్టిగా షాకిచ్చింది. ఇప్పటి వరకు తన ఇన్స్టాగ్రామ్లో ఉన్న పోస్టులను అన్నీ డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. హ్యాపీ న్యూయర్ రోజున అభిమానులకు ఆడియో ఫైల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. నాలోని భావాలు, ఆలోచనలను ఆడియో డైరీ ద్వారా పంచుకోవాలనుకొంటున్నాను అని దీపిక పేర్కొన్నారు.
నా ఆడియో డైరీ వినడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి స్వాగతం. నా ఆలోచనలు, ఫీలింగ్స్ను రికార్డు చేశాను. 2020 సంవత్సరంలో అనిశ్చితి ఎంత బాధించిందనే విషయం మీ అందరికి తెలుసు. అయితే కొత్త ఆశలు, ఆశయాలతో మీముందుకు ఉన్నందుకు గ్యాటిట్యూడ్ను తెలియజేస్తున్నాను. 2021 సంవత్సరం ప్రతీ ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకొంటున్నాను అని దీపిక పదుకోన్ పేర్కొన్నారు.

సంవత్సరం ముగింపున డిసెంబర్ 31వ తేదీన దీపిక పదుకోన్ తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లోని పోస్టులను డిలీట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆమె సోషల్ మీడియా నుంచి పిరికి దాని మాదిరిగా పారిపోయిందంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈక్రమంలోనే ఆమె ఆడియో డైరీని రిలీజ్ చేసి ట్రోల్స్కు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.


Click it and Unblock the Notifications











