Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సినిమాలకు దూరంగా దీపికా పదుకొన్.. ఆ హీరో కారణంగానే!
Recommended Video
వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న బాలీవుడ్ తార దీపికా పదుకోన్ వేగానికి కొంచెం కళ్లెంపడినట్టు కనిపిస్తున్నది. పద్మావతి చిత్రం తర్వాత ఏ చిత్రానికి కూడా ఒకే చెప్పకపోవడంతో బాలీవుడ్లో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రణ్వీర్తో పెళ్లి అంటూ, లేదా ఆరోగ్యం సరిగా లేకపోవడం అంటూ అనేక రకాలుగా చర్చనీయాంశమయ్యాయి. అయితే దీపికా సినిమాలు సెట్స్ పైకి వెళ్లకపోవడానికి ప్రధాన కారణాలు ఇవేనంటూ బాలీవుడ్ పత్రికలు విశ్లేషిస్తున్నాయి.
గ్యాంగ్స్టర్ డ్రామా
పద్మావత్ చిత్రంతో దీపికా మరోసారి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మనసును దోచుకొన్నది. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత దీపికా కొత్త ప్రాజెక్టులను అంగీకరించినట్టు వార్తలు రాలేదు. కానీ పద్మావతికి ముందే దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించే గ్యాంగ్స్టర్ డ్రామాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం
విశాల్ భరద్వాజ్ చిత్రం సెట్స్పైకి వెళ్లే సమయంలోనే అనూహ్యంగా బ్రేక్ పడింది. ఈ చిత్రంలో దీపికా పక్కన నటించనున్న ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమించడంతో గ్యాంగ్స్టర్ డ్రామా షూటింగ్ నిలిచిపోయింది. దాంతో రెడీగా సినిమాలు చేతిలో లేకపోవడంతో ప్రస్తుతం గోళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీపికాకు ఆరోగ్య సమస్యలు
ఇదిలా
ఉండగా,
దీపికా
పదుకొనే
ఆరోగ్యంపై
కూడా
అనేక
కథనాలు
వినిపిస్తున్నాయి.
ఆమె
వెన్ను,
మెడ
నొప్పితో
బాధపడుతున్నట్టు
బాలీవుడ్
వర్గాల
సమాచారం.
ఇటీవల
వెన్నునొప్పి
గాయం
తిరగతోడటంతో
ఆమె
సినిమాలకు
దూరంగా
ఉందనే
మాట
వినిపిస్తున్నది.
త్వరలోనే
ఈ
సమస్య
నుంచి
బయడపడుతారు
అని
ఆమె
సన్నిహితులు
వెల్లడించారు.
రెమ్యునరేషన్ షాక్
దీపికా ఫ్రీ టైమ్ను ఎంజాయ్ చేస్తూనే మంచి పాత్రలపై దృష్టిపెట్టారట. ప్రముఖ ప్రొడక్షన్స్ వినిపించే కథలను ప్రస్తుతం వింటున్నారట. పద్మావతి తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్, కరణ్ జోహర్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్లు ఆమెతో సంప్రదింపులు జరిపాయట. అయితే పద్మావతి తర్వాత దీపికా పెంచిన రెమ్యునరేషన్ విని వారు వెనకడుగు వేసినట్టు తెలుస్తున్నది.