వైరల్ అవుతున్న దీపిక-రణవీర్ న్యూ వెడ్డింగ్ ఫోటో... వారంతా ఎవరు?
Recommended Video

దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 14న కొంకణి స్టైల్లో, నవంబర్ 15న సింధి స్టైల్లో వీరి వివాహం జరిగింది. పెళ్లి ఫోటోస్ చూద్దామనే అభిమానుల ఎదరుచూపులు ఎట్టకేలకు గురువారం సాయంత్రం ఫలించాయి. దీపిక తన సోషల్ మీడియా పేజీలో కొంకణి స్టైల్ వెడ్డింగ్ పిక్, రణవీర్ సింధి స్టైల్ వెడ్డింగ్ పిక్ షేర్ చేశారు.
తాజాగా దీపిక, రణవీర్ వివాహానికి సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంకణి స్టైల్ వెడ్డింగ్ను తలపిస్తున్న ఈ ఫోటో రణవీర్ స్టైలిస్ట్ నిటాషా గౌరవ్ ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేశారు.

ఆ ఫోటోలో ఉన్నది ఎవరు?
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులంతా ఎవరో కాదు... స్టైలిస్ట్ నిటాషా గౌరవ్ అండ్ ఎంటైర్ టీమ్. ఇటలీలో రణవీర్తో పాటు వారి కుటుంబ సభ్యులను అందంగా తీర్చిదిద్దింది ఈ టీమ్ అని తెలుస్తోంది.

ఆదివారం ఇండియాకు...
ప్రస్తుతం ఇటలీలో ఉన్న దీపిక, రణవీర ఆదివారం ఇండియా చేరుకోనున్నారు. ఇండియా వచ్చిన తర్వాత ఈ జంట నేరుగా దీపిక అత్తారిల్లు, ముంబైలోని రణవీర్ నివాసానికి చేరుకోనున్నారు. ఈ మేరకు ఇప్పటికే రణవీర్ ఇంటిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

బెంగుళూరు ‘ది లీలా'లో దిపీక వెడ్డింగ్ బాష్
దీపిక పదుకోన్ కుటుంబం నవంబర్ 21వ తేదీన బెంగుళూరులోని ‘ది లీలా'లో గ్రాండ్ వెడ్డింగ్ బాష్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు దీపిక బంధువులు, కర్నాటకకు చెందిన ప్రముఖులు హాజరు అవుతారని తెలుస్తోంది.

ముంబైలో గ్రాండ్ రిసెప్షన్
నవంబర్ 28న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో దీపిక-రణవీర్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్కు బాలీవుడ్ చిత్ర సీమకు చెందిన ప్రముఖులంతా హాజరు కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











