Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఛీ ఛీ.... రణవీర్తో పెళ్లి తర్వాత ఆ ప్రశ్న వేయగా దీపిక పదుకోన్ రియాక్షన్ ఇదీ!
బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో ఇటలీలోని లేక్ కోమోలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కొంకణి, సింధి సాంప్రదాయాల్లో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా అభిమానుల కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.
పెళ్లి తర్వాత కూడా దీపిక పదుకోన్ సినిమాల్లో కంటిన్యూ కాబోతున్నారు. అది ఓకే కానీ... చాలా మందిలో ఓ సందేశం ఇంకా అలానే ఉండి పోయింది. వివాహం తర్వాత తెరపై వేరే హీరోలతో ముద్దు సీన్లు చేస్తారా? అనే? ప్రశ్నకు దీపిక విచిత్రంగా రియాక్ట్ అయ్యారు.
ఛీ... అంటూ
తాజాగా ఓ మేగజైన్ ఇంటర్వ్యూలో దీపిక పాల్గొనగా ‘‘పెళ్లి తర్వాత మీరు చేయబోయే సినిమాల కాంట్రాక్టుల్లో నో కిస్సింగ్ క్లాజ్' ఉంటుందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి వెంటనే ‘ఛీ...' అంటూ రియాక్ట్ అయ్యారు దీపిక. ఆమె రియాక్షన్ చూస్తుంటే ఇకపై ముద్దు సీన్లు చేయబోదని స్పష్టమవుతోంది.
హనీమూన్ వాయిదా
రణవీర్, దీపిక పెళ్లి అయింది కానీ... ఇంకా హనీమూన్ వెళ్లలేదు. అందుకు కారణం వారి ప్రొఫెషనల్ కమిట్మెంట్సే. ఈ విషయమై దీపికను ప్రశ్నించగా... ప్రస్తుతం రణవీర్ ప్రొఫెషన్ పరంగా బిజీగా ఉండటతో ఇంకా దాని గురించి ఆలోచించలేదని, త్వరలోనే ప్లాన్ చేసుకుంటామని తెలిపారు.
రణవీర్ సంగ్
రణవీర్ సింగ్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటించిన ‘సింబా' మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల తర్వాత రణవీర్, దీపిక హనిమూన్ వెళ్లే అవకాశం ఉంది.
దీపిక పదుకోన్
దీపిక పదుకోన్ త్వరలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటించబోతోంది. యాసిడ్ ఎటాక్కు గురైన లక్ష్మి అగర్వాల్ జీవితంగా ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రం ద్వారా దీపిక నిర్మాతగా మారుతుండటం విశేషం.