Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దీపిక పదుకోన్ మేనేజర్ ఇంట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. మరోసారి సమన్లతో ఎన్సీబీ కొరడా!
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు మరోసారి పంజా విసిరారు. ముందస్తు సమాచారం మేరకు దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్ నివాసంలో మెరుపుదాడులు చేశారు. ఆమె నివాసం నుంచి భారీ మొతాదులో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం బాలీవుడ్ను ఓ కుదుపుకు గురిచేసింది. అయితే దాడుల తర్వాత ఆమె అజాతంలోకి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్సీబీ దాడుల వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో
గత నెల డ్రగ్స్ రాకెట్ కేసులో పలువురిని విచారించడం, అరెస్ట్ తర్వాత ఎన్సీబీ నిర్వహించిన విచారణలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆమెను సెప్టెంబర్లో విచారించారు. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతుండగానే కరిష్మా ఇంటిపై మరోసారి దాడులు నిర్వహించారు.
దీపికా పదుకోన్తో వాట్సప్ ఛాటింగ్
కరిష్మా ప్రకాశ్తో దీపిక పదుకోన్ చాటింగ్ చేస్తూ.. మాల్, హాష్ లాంటి పదాలను ఉపయోగించడం ఎన్సీబీ అధికారులు దృష్టికి వచ్చింది. లోతైన దర్యాప్తు చేయగా.. DP+Ka+KWAN అనే వాట్సప్ గ్రూప్ కూడా డ్రగ్స్ కోసం ఉపయోగిస్తున్నారనే విషయం వెలుగు చూసింది. ఈ క్రమంలోనే దీపిక పదుకోన్, సారా అలీ ఖాన్, శ్రద్దా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత మధు మంతెనను ఎన్సీబీ అధికారులు విచారించారు.
కరణ్ జోహర్ పార్టీకి క్లీన్ చిట్
గతంలో కరణ్ జోహర్ ఇంటిలో జరిగిన పార్టీలో డ్రగ్స్ ఉపయోగించారనే ఆరోపణలపై సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోను ఎన్సీబీ అధికారులు పరిశీలించారు. ఆ వీడియోను ఫోర్సెన్సిక్ నిపుణులు సోమవారం దర్యాప్తు చేసి క్లీన్ చిట్ ఇవ్వడంతో సినీ తారలకు ఉపశమనం లభించింది. అంతలోనే దీపిక పదుకోన్ మేనేజర్పై కొరడా ఝులిపించడం సంచలనంగా మారింది.
కరిష్మా ఇంటి నుంచి డ్రగ్స్ స్వాధీనం
దీపికా పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్ నివాసంలో దాడులు జరిగిన విషయం నిజమే. బుధవారం (అక్టోబర్ 28న) విచారణకు హాజరుకావాలని ఆమెకు సమన్లు జారీ చేశాం. ముంబైలోని ఆమె నివాసంలో దాడులు నిర్వహించగా 1.8 గ్రాముల హాషిష్ (నిషేధిత మాదక ద్రవ్యం) లభించింది అని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే మీడియాకు తెలిపారు. అయితే దాడుల తర్వాత ఆమె ఆచూకీ లభించడం లేదు అని అధికారులు వెల్లడించారు.
మరిన్ని అరెస్టులు, మరికొంత మందికి సమన్లు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే రియా బెయిల్పై విడుదల కాగా, షోవిక్ జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలో అర్జున్ రాంపాల్ ప్రేయసి సోదరుడు అరెస్ట్ కావడం, అలాగే బాలీవుడ్ నటి సప్న పబ్బాకు సమన్లు జారీ చేయడం, ఈ క్రమంలోనే దీపిక మేనేజర్ ఇంట్లో డ్రగ్స్ లభించడంతో ఈ కేసు మరింత సీరియస్గా మారింది.