Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
దర్శకుడికి కంగన రనౌత్ కుచ్చుటోపి.. దీపిక పదుకోన్ ఏం చేశారంటే
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు వరుస చిత్రాలతో జోష్ పెంచాడు. ఓ వైపు లైఫ్ ఇన్ ఏ మెట్రో సినిమాను తెరకెక్కిస్తూనే కంగన రనౌత్తో ఇమ్లీ అనే చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇమ్లీ నుంచి కంగన తప్పుకోవడంతో అనురాగ్కు షాక్ తగిలింది.
కంగన రనౌత్ స్థానంలో దీపికా పదుకోన్ను హీరోయిన్గా తీసుకోవాలని అనురాగ్ బసు డిసైడ్ అయ్యారట. ఇటీవల దీపికాను అనురాగ్ బసు కలిశారు. తన స్క్రీప్టును ఆమెకు అందజేశారు. అయితే స్క్రిప్టుపై దీపికా పదుకోన్ సానుకూలంగా స్పందించారు అని బాలీవుడ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
క్రియేటివ్ డిఫెరెన్స్ కారణంగా కంగన రనౌత్ ఈ ప్రాజెక్ట్కు గుడ్ బై చ చెప్పింది. కానీ కంగనను ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. కానీ కుదర్లేదు. దాంతో దీపికా వద్దకు స్క్రిప్టుతో వెళ్లాడు అని కథనంలో పేర్కొన్నాడు. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యం అవుతుందనే కారణంతోనే నేను ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానని దీపికా పదుకోన్ వెల్లడింది.
ప్రస్తుతం దీపికా పదుకోన్ చపాక్ అనే చిత్రంతో బిజీగాఉన్నారు. అలాగే మేఘనా గుల్జార్ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత ఇమ్లీ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తున్నది.