Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇంత దౌర్భాగ్యమా! ఆ హీరోయిన్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. రాజకీయ నేత డిమాండ్
బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత తజిందర్ బగ్గా డిమాండ్ చేస్తున్నారు. జేఎన్యూలో జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో దీపికా పదుకొనే తీరుపై ఆయన మండిపడ్డారు. ఆమెపై విమర్శలు గుప్పిస్తూ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? బీజేపీ నేత దీపికపై ఎందుకింతలా విరుచుకుపడ్డారు? వివరాల్లోకి పోతే..
హింసాత్మక ఘటన.. దేశవ్యాప్త సంచలనం
జేఎన్యూ (జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ) ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ హింసాత్మక ఘటనపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మంగళవారం సాయంత్రం జేఎన్యూ క్యాంపస్కి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థులకు దీపికా పదుకొనే మద్దతు.. వీడియో వైరల్
జేఎన్యూలో
జరిగిన
హింసాత్మక
ఘటనలను
నిరసిస్తూ..
జేఎన్యూ
బయట
ఆందోళన
చేస్తున్న
విద్యార్థులకు
దీపికా
పదుకొనే
మద్దతు
తెలిపింది.
ఈ
కార్యక్రమంలో
జేఎన్యూఎస్యూ
మాజీ
అధ్యక్షుడు
కన్నయ్
కుమార్
కూడా
పాల్గొన్నారు.
ఇందుకు
సంబంధించిన
వీడియో
సోషల్
మీడియాలో
వైరల్
అయింది.
ఇంత దౌర్భాగ్యమా! దీపికా పదుకొనేపై బీజేపీ నేత ఫైర్
దీంతో
ఈ
పరిణామంపై
బీజేపీ
నేత
తాజిందర్
పాల్
సింగ్
బగ్గా
రియాక్ట్
అయ్యారు.
దీపికా
పదుకొనే
జేఎన్యూకు
వెళ్లడంపై
మండిపడుతూ
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.
దేశాన్ని
ముక్కలు
ముక్కలు
చేస్తామంటూ
నినదించిన
వారికి
దీపికా
పదుకొనే
మద్దతు
తెలపడం
దౌర్భాగ్యమని
అన్నారు.
ఈ
మేరకు
వెంటనే
ఆమె
క్షమాపణలు
చెప్పాలని
డిమాండ్
చేశారు.
|
ఇదీ జేఎన్యూ క్యాంపస్లో జరిగింది
ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు దుండగులు జేఎన్యూ లోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విచక్షణా రహితంగా విద్యార్థులపై రాళ్లతో, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దుశ్చర్యలో 40 మంది విద్యార్థులతోపాటు జేఎన్యూ ఎస్యూ ప్రెసిడెంట్, ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
భారీగా పోలీస్ బలగాలు.. హిందూ రక్షా దళ్
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఈ దుర్ఘటనపై ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లర్లు జరగకుండా జేఎన్యూలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. జేఎన్యూలో హింసకు ఏబీవీపీయే కారణమని లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ దాడికి తామే కారణమని హిందూ రక్షా దళ్ ప్రకటించింది.