Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రూములో ఒక్క స్త్రీ కూడా లేదు: నరేంద్ర మోడీ, అక్షయ్ కుమార్ మీద హీరోయిన్ ఫైర్!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ డిసెంంబర్ 18న ముంబైలోని రాజ్ భవన్లో బాలీవుడ్ యాక్టర్స్, ప్రొడ్యూసర్లతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సినిమా రంగానికి చెందిన అంశాలపై చర్చించారు. ఈ మీటింగులో పులువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.
అయితే ఈ సమావేశంపై స్త్రీ వాదులు విమర్శలు చేస్తున్నారు. అందుకు కారణం ఈ మీటింగులో ఒక్క స్త్రీ కూడా కనిపించక పోవడమే. ఇండస్ట్రీలో ఎంతో మంది మహిళలు పని చేస్తున్నారు. యాక్టర్లు, డైరెక్టర్లు, నిర్మాతలుగా కొనసాగుతున్నారు.. వారిలో ఏ ఒక్కరికీ ఆహ్వానం అందక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అక్షయ్ కుమార్ ట్వీట్
ప్రధాని నరేంద్ర మోడీ తమ విలువైన సమయాన్ని కేటాయించి, ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు విని... వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.
విమర్శిస్తూ దియా మీర్జా ట్వీట్
అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ మీద దియా మీర్జా స్పందిస్తూ... ‘‘ఈ మీటింగ్ రూములో ఒక్క స్త్రీ కూడా కనిపించక పోవడం ఆశ్చర్యం వేసింది, ఎందుకు వారికి ఈ సమావేశంలో భాగస్వామ్యం కల్పించలేదు'' అంటూ ప్రశ్నించారు.
|
ఎవరెవరు పాల్గొన్నారు?
ఈ సమావేశంలో రితేష్ సిధ్వానీ, కరణ్ జోహార్, రాకేష్ రోషన్, రోనీ స్క్రూవాలా, సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రసూన్ జోషి, సిద్ధార్థ్ రాయ్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ పాల్గొన్నారు.
ట్విట్టర్లో ట్రోలింగ్
మరో వైపు సోషల్ మీడియాలో ఈ విషయమై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నామనేది మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదని నెటిజన్లు విమర్శలకు దిగుతున్నారు.