Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరోసారి ప్రేక్షకుల ముందుకు డీడీఎల్జే
దిల్వాలే దుల్హనియా లేజేయాంగే అన్న పేరు వింటేనే సినీ ప్రేమికులు మైమరచిపోతారు. 1995 లో విడుదలైన ఈ ప్రేమ కావ్యం భారతీయ సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాసింది. ఆ తరువాత ఎన్నో ప్రేమకథా చిత్రాలకు ఈ సినిమానే ఊపిరి పోసింది అనడంలో అతిశయోక్తిలేదు. 'తుజే దేఖా తో యే జానా సనమ్' అంటూ సాగే ఈ పాటని ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు సినీ జనాలు.
ఇదే సినిమాలో రైల్వే స్టేషన్లో వచ్చే సీన్ని అయితే కొన్ని వందల సినిమాల్లో రిపీట్ చేశారు. ఈ సినిమాతోనే షారుఖ్-కాజోల్ జోడీ ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది . ప్రేమికులు అంటే వీరిలానే ఉండాలి అనేంతగా షారుక్ కాజోల్ నటించారు.
ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో ఈ సినిమా 15 సంవత్సరాలపాటు ఆడింది. అక్టోబర్ 20 తో ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒక సినిమా విడుదలై25 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ చిత్రం గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్నారంటే ఆ ప్రేమకథ వెండితెరపై, సినీప్రియుల మనసులపై ఎలాంటి ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు.
కేవలం నాలుగు కోట్ల రూపాయలతో తెరకెక్కిన డీ.డీ. ఎల్. జె ఆ ఏడాది ఏకంగా 89 కోట్లు వాసులు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ ను కూడా కలుపుకొని మొత్తంగా 102.50 కోట్లు వాసులు చేసింది. అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను 18 దేశాల్లో విడుదల చేస్తున్నారు. జర్మనీ , యుఎఈ , సౌదీ అరేబియా, ఖతార్, యుఎస్ఎ, యుకె, కెనడా, మారిషస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, నార్వే, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఎస్టోనియా , ఫిన్లాండ్ దేశాల్లో డీడీఎల్జే మరోసారి సందడి చేయనుంది.