Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దిశ సలియాన్ ఒంటిపై బట్టల్లేవు.. రక్తంతో తడిసిన దేహం.. షాకింగ్గా పోస్టుమార్టం రిపోర్టు
దిశా సలియాన్ మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిపబ్లిక్ టీవీకి చిక్కిన రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. జూలై 8న మరణించిన దిశ సలియాన్ పోస్టు మార్టం రిపోర్టు బయటకు పొక్కకుండా కొందరు అడ్డుకొంటున్నారనే ఆరోపణల మధ్య తాజాగా వైద్యులు వెల్లడించిన విషయాలు ఆమె మరణంపై అనుమానాలను పటాపంచలు చేశాయి. దిశ సలియాన్ పోస్టు మార్టం రిపోర్టు గురించి వివరాల్లోక వెళితే..
Recommended Video
దిశ సలియాన్ మరణంపై అనుమానాలు
సుశాంత్, ఐశ్వర్యరాయ్ లాంటి సినీ ప్రముఖులకు మేనేజర్గా వ్యవహరించిన దిశా సలియాన్ మరణం జూన్ 8వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించింది. ముంబైలోని మల్లాడ్లోని 14 అంతస్థుల భవనం మీద నుంచి పడి ఆమె ఆత్మహత్య చేసుకొన్నారనే విషయం మీడియాకు ఆలస్యంగా అందింది. అయితే ఆమెకు మూడు రోజుల తర్వాత పోస్టు మార్టం నిర్వహించారు.
మూడు రోజులు తర్వాత పోస్టు మార్టం...
దిశ సలియాన్కు పోస్టుమార్టం ఆలస్యంగా నిర్వహించడంపై పోలీసులు స్పందిస్తూ.. మరణించిన వ్యక్తులకు పోస్టు మార్టం చేయడానికి ముందు వారికి కరోనావైరస్ టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. దిశ సలియాన్కు కరోనా పరీక్షలు నిర్వహించడం వాటి ఫలితాలు 48 గంటల తర్వాత వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు జూన్ 11వ తేదీన పోస్టుమార్టం కేవలం గంటలోపే పూర్తి చేశారు. తక్కువ సమయంలో మొక్కుబడిగా పోస్టుమార్టం చేశారనే ఆరోపణలు వెలుగు చూశాయి.
సుశాంత్ సింగ్కు అదే రోజు
అయితే దిశ మరణం తర్వాత కొద్ది రోజులకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించారు. అయితే ఆయన దేహానికి మాత్రం అదే రోజు పోస్టుమార్టం పూర్తి చేశారు. అదే రోజు చేయాలంటే 176 సీఆర్పీసీ కింద మేజిస్ట్రేట్ అనుమతి ఉండాలి. అయితే మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోస్టు మార్టం చేయడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. సాధారణంగా పోస్టుమార్టం పూర్తి చేయడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. కానీ సుశాంత్ పోస్టుమార్టమ్ ప్రక్రియను కేవలం 90 నిమిషాల్లోనే పూర్తి చేయడం అనుమానాలకు దారి తీసింది.
దిశ మరణించినప్పుడు నగ్నంగా
ఇక దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకొన్నప్పడు ఆమె ఒంటిపై బట్టలు లేకుండా ఉన్నారనే విషయం తాజాగా పోస్టు మార్టమ్ రిపోర్టులో వెల్లడైంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకొన్నప్పుడు బట్టలిప్పేసి చేసుకొంటారా అనే ప్రశ్న నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ సలియాన్ దేహంపై గాయాలు, రక్తపు మరకలు
అంతేకాకుండా దిశ సలియాన్ దేహంపై అనేక గాయాలు, రక్తపు మరకలు ఉన్నాయి. ఆమె ప్రైవేట్ పార్టులపై గాయాలు రేప్, మర్డర్ జరిగితే ఉండే విధంగా ఉన్నాయి అనే విషయం బయటకు వచ్చింది. ఇదే విషయాన్ని మీడియాకు సుశాంత్ చెప్పాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో రెండు మరణాలకు లింక్ ఉందనే విషయంపై మీడియాలో చర్చ జరుగుతున్నది.
దిశ పాల్గొన్న పార్టీలో గొడవ
దిశ సలియాన్ మరణం జూన్ 9 తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. అయితే ఆమె తన మరణానికి ముందు ఓ పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీలో జరిగిన గొడవనే ఆమె మరణానికి కారణం. అయితే ఆ పార్టీలో కొందరు ఆమెతో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉందనే వాదనలు సోషల్ మీడియాలో సునామీలో కనిపిస్తున్నాయి. దిశతో జరిగిన గొడవనే సుశాంత్ మరణానికి కూడా కారణమని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.