Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జీఎస్టీకి కుచ్చుటోపి.. కోట్ల కుంభకోణం.. బాలీవుడ్ దర్శకుడి అరెస్ట్!
జీఎస్టీ కట్టకుండా ఎగవేతకు పాల్పడిన బాలీవుడ్ దర్శకుడు విజయ్ రత్నాకర్ను అధికారులు అరెస్ట్ చేశారు. పన్ను చెల్లింపులో రూ.34 కోట్ల మేర మోసానికి పాల్పడినట్టు గుర్తించిన విజయ్ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అదుపులోకి తీసుకొన్నది. ఈయనపై సీజీఎస్టీ యాక్ట్లోని సెక్షన్ 132 (1) (సీ) కింద కేసు నమోదు చేశారు. విజయ్ అరెస్ట్ వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ విషయంలో ఏం జరిగిందంటే..
వివరాల్లోకి వెళితే.. నకిలీ బిల్లుల ద్వారా రూ.34 కోట్ల జీఎస్టీ క్రెడిట్ను విజయ్కి చెందిన కంపెనీ వీఆర్జీ క్లెయిమ్ చేసుకొన్నది. 266 కోట్ల విలువైన యానిమేషన్, సిబ్బంది సేవలను హరిజోన్ కంపెనీ ఉపయోగించుకొన్నట్టు నకిలీ ఇన్వాయిస్లో పేర్కొన్నది. ఈ వ్యవహారంలో వీఆర్జీ డిజిటల్ 34 కోట్లు, హరిజోన్ కంపెనీ రూ.170 కోట్ల జీఎస్టీకి మోసం చేసినట్టు గుర్తించారు. దాంతో ఈ రెండు కంపెనీలను సీజ్ చేసినట్టు తెలుస్తున్నది.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడైన విజయ్ ప్రస్తుతం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్ను తెరకెక్కిస్తున్నాడు. మన్మోహన్ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్సింగ్' పుస్తకం ఆధారంగా ఈ చిత్్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.