Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కంగన రనౌత్పై డ్రగ్స్ కేసు.. యువ హీరో భలే ఇరికించాడుగా.. సర్కార్ ప్రతీకార చర్య!
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి కంగన రనౌత్పై కూడా దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ కుమారుడు ఆద్యన్ సుమన్ ఇంటర్వ్యూను ఆధారంగా చేసుకోని కేసు నమోదు చేయాలని శివసేన ఎమ్మెల్యేలు సునీల్ ప్రభు, ప్రతాప్ సర్నాయక్ చేసిన డిమాండ్కు హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాలీవుడ్లో డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
Recommended Video
బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ పరీక్షలు చేయాలి
సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తికి డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చిన తర్వాత కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వాడే ప్రతీ ఒక్కరి గురించి వివరాలు బయటపెడుతాను. బాలీవుడ్లో డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే 90 శాతం మంది అగ్రనటులు జైల్లోనే ఉంటారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చికటి కోణాలు తెలిసినందునే సుశాంత్ను చంపారు
నార్కోటిక్ బ్యూరో సహాయం కోరితే వారికి నేను పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాను. అందుకు నాకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. బాలీవుడ్లో సినీ ప్రముఖుల దాడిలో నా జీవితాన్నే కాదు.. కెరీర్ను రిస్క్ నుంచి కాపాడుకొన్నాను. ఇండస్ట్రీలో కొందరి బాగోతాలు, చీకటి కోణాలు తెలిసినందునే సుశాంత్ను చంపారు అని కంగన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ పార్టీలో కొకైన్
కంగన రనౌత్ ఇటీవల ట్వీట్ చేస్తూ బాలీవుడ్ పార్టీలలో ఎక్కువగా ఉపయోగించేది కొకైన్. అది చాలా ఖరీదైనప్పటికీ.. దానిని బాలీవుడ్లో జరిగే అన్ని పార్టీలలో ఉపయోగిస్తారు. సినీ పరిశ్రమలో గొప్ప నటులు ఇంటికి వెళితే.. ఎండీఎంఏ డ్రగ్స్ను నీళ్లలో కలిపి ఇస్తారు అని కంగన ట్వీట్ చేశారు.
ప్రముఖ హీరోతో డేటింగ్ చేసినప్పుడు
ఇక అంతేకాకుండా తాను ఓ ప్రముఖ హీరోతో డేటింగ్ చేసినప్పుడు పార్టీలకు వెళ్లేదానిని. అక్కడ చాలా మంది సినీ హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ వినియోగించడం చూశాను. నన్ను కూడా డ్రగ్స్ వాడమని అడిగే వారు. అయితే తాను అందుకు వ్యతిరేకించాను. ఆ హీరోతో నాకు బ్రేకప్ అయిన తర్వాత నన్ను పార్టీలకు పిలువడం మానేశారు అని కంగన స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆద్యన్ సుమన్ ఇంటర్వ్యూ ఆధారంగా కేసు
ఇలాంటి సంచలన వ్యాఖ్యలు, ట్వీట్ల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎదురుదాడి ప్రారంభించింది. గతంలో ఆద్యన్ సుమన్ ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ.. కంగన రనౌత్కు డ్రగ్స్ వాడే అలవాటు ఉంది. నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమని బలవంతం చేసేది అని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆద్యన్ సుమన్ చెప్పిన విషయాల ఆధారంగా చేసుకొని మహారాష్ట్ర సర్కార్ కంగనపై డ్రగ్స్ కేసును దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.