క్రికెటర్తో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
క్రికెటర్ లు, హీరోయిన్ల మధ్య ఘాటుగా ఎఫైర్ సాగడం మామూలే. ఇదే తరహాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నటాషా సూరి, కరేబియన్ క్రికెటర్ బ్రేవో మధ్య ఏదో జరుగుతోందంటూ ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి వార్తలు మొదలయ్యాయి. ఈ ఐపీఎల్ లో బ్రేవో చెన్నె తరుపున అద్భుత ఇన్నింగ్స్ ఆడిన మ్యాచ్ కు నటాషా సూరి కూడా హాజరైంది.
మ్యాచ్ అనంతరం ఓ హోటల్ లో వీరిద్దరూ కలసి సెల్ఫీలు దిగారు. ఈ సెల్ఫీలతో నటాషా, బ్రేవో బాగా క్లోజ్ గా ఉండడంతో వీరి మధ్య ఎఫైర్ సాగుతోందని, ఇద్దరూ కలసి డేటింగ్ చేస్తున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. స్వయంగా నటాషానే ఆ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

దీనితో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. తాజగా నటాషా సూరి పుకార్లపై స్పందించింది. బ్రేవో తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని, ఆడ, మగా కలసి ఉన్నంత మాత్రాన ఇలాంటి వార్తలు సృష్టిస్తారా అంటూ మండిపడింది. బ్రేవో మంచి క్రికెటర్, మంచి గాయకుడు కూడా. అందుకే అతడంటే ఇష్టం. అంతమాత్రాన మా మధ్య ఎదో జరుగుతోందని ఊహించుకోవద్డు అంటూ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











