Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రియా చక్రవర్తి 9 గంటలు ఈడీ అదుపులో.. డొంక తిరుగుడు జవాబిస్తే అరెస్టే అంటూ..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానిత సూసైడ్కు సంబంధించిన కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని ఈడీ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్యాంక్ అకౌంట్లు, ముంబైలో విలువైన ఆస్తులు, కంపెనీల ఏర్పాటు లాంటి అంశాలపై నిశితంగా ప్రశ్నల వర్షం కురిపించగా వాటికి కొంత అసహనంతో సమాధానం చెప్పినట్టు వార్తలు వచ్చాయి. శుక్రవారం నాటి విచారణలో చోటుచేసుకొన్న విషయాలకు సంబంధించి మరిన్నీ విషయాలు..
Recommended Video
మధ్నాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ అధికారులు ఆదేశాలతో రియా చక్రవర్తి ఈడీ కార్యాలయానికి ఉదయం 11.50 గంటలకు చేరుకొన్నారు. అప్పటి నుంచి ప్రారంభమైన విచారణ రాత్రి 8.45 గంటల వరకు సాగింది. సుమారు 9 గంటలపాటు మనీలాండరింగ్, ఫెరా నిబంధనల ఉల్లంఘన, సుశాంత్తో రియా, ఆమె సోదరుడు షోవిక్ బిజినెస్ వ్యవహారాలు, బిజినెస్ మేనేజర్ శృతి మోదీని కూడా ఈ కేసులో ప్రశ్నించారు.
ఈడీ ప్రశ్నలకు అసహనం అంటూ
అంతేకాకుండా రియా చక్రవర్తి పన్ను చెల్లింపు పత్రాలు, పెట్టుబడులు, ఆదాయ వనరులు, బిజినెస్ డీల్స్, ప్రొఫెషనల్ డీల్స్ గురించి కూడా ఆరా తీసినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ అధికారుల పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారని, కొన్ని ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేయడం లాంటివి చేశారని పేర్కొన్నారు.
సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు
జూలై
31వ
తేదీన
సుశాంత్
తండ్రి
కేకే
సింగ్
పాట్నాలో
దాఖలు
చేసిన
పిటిషన్లో
రూ.15
కోట్లు
బ్యాంక్
నుంచి
బదిలీ
అయ్యాయని
ఆరోపించారు.
ఈ
క్రమంలో
రాజ్పుత్
స్థాపించిన
నాలుగు
కంపెనీల
గురించి
ఈడీ
అధికారులు
సమాచారాన్ని
అడిగి
తెలుసుకొన్నట్టు
తెలిసింది.
అయితే
రెండు
కంపెనీలు
రిజిస్టర్
అయ్యాయి.
మరో
రెండు
కంపెనీలు
రిజిస్ట్రేషన్
ప్రాసెస్లో
ఉన్నాయి
అని
రియా
చెప్పినట్టు
తెలిసింది.
డొంక తిరుగుడు సమాధానాలిస్తే..
రియా చక్రవర్తి విచారణపై సుశాంత్ ఫ్యామిలీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ.. ఈడీ దర్యాప్తుకు ఎట్టకేలకు స్పందించారు. ఈ విచారణలో అధికారులు వేసే ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలిస్తే అరెస్ట్ చేసే వాళ్లే. ఇంకా సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగంపై లోతైన విచారణ జరగాలి అని అన్నారు.
సిద్ధార్థ పితానికి ఈడీ పిలుపు
శుక్రవారం జరిగిన విచారణలో రియాతోపాటు, ఆమె తండ్రి ఇంద్రజిత్, సోదరుడు షోవిక్ బిజినెస్ వ్యవహారాలు, బిజినెస్ మేనేజర్ శృతి మోదీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక శనివారం సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ పితానిని ఈడీ విచారించనున్నది. ఇప్పటికే సుశాంత్ చార్డెట్ అకౌంట్ను విచారించిన సంగతి తెలిసిందే.