Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సక్సెస్ హీరో తలకెక్కిందా? ఆ యాటిట్యూడ్ ఏంటో... సోషల్ మీడియాలో ట్రోల్స్!
షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన 'కబీర్ సింగ్' బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. రూ. 300 కోట్లు వసూలు చేసింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో సూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' చిత్రానికి రీమేక్.
అయితే ఈ సినిమా విజయం తర్వాత షాహిద్ కపూర్ ప్రవర్తనలో చాలా తేడా వచ్చిందని, యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విమర్శలకు కారణం ఇటీవల ముంబైలో చోటు చేసుకున్న ఓ సంఘటనే అని స్పష్టమవుతోంది.
ఏం జరిగిందంటే...
ఇటీవల షాహిద్ కపూర్ తన కూతురు మిషాను తీసుకుని ముంబైలోని ఓ ప్లేసుకు వచ్చారు. ఆయన వస్తున్న విషయం ముందే తెలుసుకున్న మీడియా కెమెరామెన్లు అక్కడ వెయిట్ చేయడం మొదలు పెట్టారు. అయితే కారులో నుంచి దిగిన షాహిద్ ఫోటో గ్రాఫర్లకు ఫోజులు ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీంతో కబీర్ సింగ్ సక్సెస్ తర్వాత షాహిద్ యాటిట్యూడ్ చూపిస్తున్నారు, సక్సెస్ తలకెక్కినట్లు ఉంది అనే వాదన తెరపైకి వచ్చింది.
ఇది సక్సెస్ సైడ్ ఎఫెక్ట్
షాహిద్ ప్రవర్తన సక్సెస్ సైడ్ ఎఫెక్ట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకూడదు, ఇలా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తే నీకే నష్టం కలుగుతుంది. ఇప్పటికైనా ఈ విషయంలో నువ్వు రియలైజ్ అవ్వాలి అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.
షాహిద్కు మద్దతుగా ఫ్యాన్స్
అయితే షాహిద్కు మద్దతుగా ఇటు అభిమానులు రంగంలోకి దిగారు. వెంట తన చిన్నారి కూతురు ఉంది కాబట్టి షాహిద్ మీడియా వారి కెమెరా ముందు ఫోజులు ఇవ్వలేక పోయారని, దీన్ని అంత పెద్ద రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అపుడు షాహిద్ ఏ పరిస్థితిలో ఉన్నాడో.... ఆయినా ఆయన వచ్చింది ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి కాదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
కబీర్ సింగ్
'కబీర్ సింగ్' చిత్రం షాహిద్ కపూర్కు ఎంత పేరు తెచ్చిందో... ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్రెడ్డి వంగాకు అదే స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తుండటంతో సందీప్ వంగా... ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అతడికి హైదరాబాద్లో సొంతగా ఫ్లాట్ ఉంది. అయితే 'కబీర్ సింగ్' మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ ఉపయోగించుకుని బాలీవుడ్ ఎదగాలనే ప్లాన్లో ఉన్నారట.