Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా గుండె పగిలింది.. భారీ సినిమా అట్టర్ ప్లాప్, జీర్ణించుకోలేకపోతున్న హీరోయిన్!
ఈ ఏడాది ఇండియన్ సినిమా నుంచి కొన్ని మంచి చిత్రాలు వచ్చాయి. విజయం సాధించిన చిత్రాల కంటే నిరాశపరిచిన చిత్రాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆటం బాంబులాంటి సినిమాలంటూ చెప్పబడినవన్నీ తుస్సుమన్నాయి. ఆ జాబితాలో ముందుగా చెప్పుకోవలసింది అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ గురించి. అమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా ఇలా ఎంతమంది ఈ చిత్రంలో క్రేజీ స్టార్ ఉన్నా సినిమాని ప్లాన్ నుంచి తప్పించలేకపోయారు. తాజాగా ఈ చిత్ర పరాజయం గురించి దంగల్ భామ ఫాతిమ సన మాట్లాడింది.
నా గుండె పగిలింది
ఫాతిమా సన మాట్లాడుతూ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నా. కానీ ఇంత దారుణంగా నిరాశపరుస్తుందని అనుకోలేదు. ఈ చిత్ర పరాజయం చూసి నా గుండె పగిలింత పనైంది అని ఫాతిమా సన పేర్కొంది. తామందరం అద్భుతం చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని కష్టపడ్డాం. కానీ మా కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు అని ఫాతిమా వాపోయింది.
దంగల్ చిత్రంతో గుర్తింపు
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఫాతిమా సనా ఖాన్ దంగల్ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దంగల్ అఖండ విజయం సాధించడంతో ఫాతిమాకు మంచి గుర్తింపు దక్కింది. కానీ ఈ చిత్రం తర్వాత ఫాతిమాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. మరోమారు అమిర్ ఖాన్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో కీలక పాత్రలో నటించింది.
‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' ఫెయిల్యూర్... ప్రేక్షకులకు అమీర్ ఖాన్ క్షమాపణలు!
చిత్ర యూనిట్ స్వయంగా
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం విడుదలయ్యాక దారుణమైన టాక్ వచ్చింది. అమిర్ ఖాన్ క్రేజ్ తో తొలిరోజు మంచి వసూళ్లే వచ్చాయి. కానీ భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం పెట్టుబడి కూడా రాబట్టలేక చతికిల బడింది. అమీర్ ఖానే ఈ చిత్ర పరాజయాన్ని స్వయంగా అంగీకరించారు. తదుపరి చిత్రంద్వారా అభిమానులకు మంచి సినిమా అందిస్తానని హామీ ఇచ్చాడు.
బాహుబలికి పోటీగా
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం విడుదలకు ముందు బాహుబలి రికార్డులని అధికమిస్తుందని కూడా ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు. కానీ విడుదలయ్యాక బాహుబలి రికార్డులని అటుంచితే కనీసం సాధారణ సినిమాగా కూడా నిలవలేకపోయింది. ఫలితంగా ఈ ఏడాది బిగ్గెస్ట్ ప్లాప్ ఇదే అని సినీ విశ్లేషకులు తేల్చేశారు.