Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ కన్నుమూత
ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్ సేన్(95) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కోల్కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
1955 వచ్చిన 'రాత్భోరే' అనే చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టిన మృణాల్ సేన్... నీల్ అక్షర్ నీచే, పడాతిక్, భువన్ షోమే, అకాలర్ సాంధానే, ఏక్ దిన్ ప్రతిదిన్ లాంటి సినిమాలో తన ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. భారతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఆయన ఒకరు.
మృణాల్ సేన్ మే 14, 1923లో బ్రిటిష్ ఇండియాలోని ఫరీదాబాద్లో(బంగ్లాదేశ్)లో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. కొంతకాలం పాత్రికేయుడిగా పని చేసిన అనంతరం కోల్కతాలోని ఓ ఫిలిం స్టూడియోలో సౌండ్ టెక్నీషియన్గా చేరారు. అలా ఆయన సినిమా రంగం వైపు అడుగులు వేశారు.
Poll: 2018 ఉత్తమ తెలుగు చిత్రం
మృణాల్ తెరకెక్కించిన చిత్రాలు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అవార్డులు అందుకున్నాయి. 'ఖరీజ్' చిత్రం కేన్స్, వెనిస్, బెర్లిన్ చిత్సోత్సవాల్లో ప్రదర్శితమై పలు అవార్డులు దక్కించుకుంది. మృణాల్ సేన్ 1977లో 'ఒక ఊరి కథ' అనే తెలుగు చిత్రాన్ని సైతం తెరకెక్కించారు. గ్రామీణ జీవితంపై తీసిన ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది.
మృణాల్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేశారు.