Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాపై దారుణంగా దాడి.. గుద్దితే ముఖం చిట్లి.. నిర్మాత అరాచకాలపై హీరోయిన్
బాలీవుడ్ నిర్మాత గౌరంగ్ దోషికి నటి ఫ్లోరా సైనీ మరోసారి లీగల్ నోటీసులు పంపించారు. లైంగిక వేధింపుల బయటకు వెల్లడిస్తూ చేపట్టి మీ టూ ఉద్యమం ఊపందుకోవడంతో సైనీ మరోసారి తన కష్టాలను ఏకరవుపెట్టారు. ఇటీవలసంచలన విజయం సాధించిన స్త్రీ చిత్రంలో ఫ్లోరా సైనీ మంచి నటనతో ఆకట్టుకొన్నారు. గతంలో నిర్మాతపై పెట్టిన కేసు విషయంలో లీగల్ నోటీసులు పంపడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. తనను ఏవిధంగా కొట్టాడో అనే విషయంపై తన ఫేస్బుక్ ఖాతాలో ఫొటోలను షేర్ చేసింది.
నిర్మాత నాపై దాడి చేశాడు
నిర్మాత గౌరంగ్ దోషితో 2007లో డేటింగ్ చేశాను. వాలైంటిన్స్ డే రోజున నాపై దాడి చేశాడు. తీవ్రంగా దూషిస్తూ దారుణంగా కొట్టారు. బలంగా గుద్దడంతో నా గదమ విరిగిపోయింది. ఆ గాయం కారణంగా నా జీవితం దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడింది.
ఇండస్ట్రీలో బాగా పలుకుబడితో
నాపై దాడి చేసిన సమయంలో గౌరంగ్ దోషి గురించి ప్రముఖులకు చెప్పాను. కానీ ఆయనకు ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉండటంతో నాకు సహకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
బెదిరింపులకు పాల్పడ్డాడు
ఆయనపై నేను కేసు పెట్టడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నాకు అవకాశాలు రాకుండా చేశారు. నాకు వచ్చిన అవకాశాల స్థానంలో మరొకరికి ఛాన్స్లు ఇప్పించారు. రకరకాల ప్రయత్నాలు చేసి ఇండస్ట్రీకి దూరం చేశారు.
నాకైన గాయాలు చూడండి
నేను పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానని రూమర్లు క్రియేట్ చేశారు. నన్ను ఏ విధంగా గాయపరిచారో మీరే చూడండి. నా ఫొటోలు చూసిన తర్వాత నాకు చాలా మంది అండగా నిలిచారు అని ఫ్లోరా సైనీ తెలిపారు.
ఫ్లోరా సైనీ ఆరోపణలు అబద్ధం
అయితే ఫ్లోరా సైనీ చేస్తున్న ఆరోపణలను గౌరంగ్ దోషి ఖండించారు. నాపై ఆరోపణలు చేస్తూ ఫ్లోరా సైనీ నా ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నది. తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్లిసిటీ కోసం నా పేరు వాడుకొంటున్నది అని గౌరంగ్ దోషి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
దోషి అరాచకాలు కోర్టులోనే
గౌరంగ్ దోషి అరాచకాలను మీడియాలో చెప్పడం వల్ల ప్రయోజనం లేదని భావిస్తున్నాను. ఇక చట్టపరంగా చర్యలు తీసుకొంటాను. అతను అబద్ధాలు ఆడుతున్నారనే విషయం స్పష్టమైంది. నేను పెట్టిన కేసులో అతను నిర్ధోషి అనేి చెప్పుకొంటున్నాడు. కానీ ఏ కేసులో కూడా అతను నిర్దోషి అని కోర్టు చెప్పలేదు అని ఫ్లోరా సైనీ అన్నారు.