Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరోయిన్ చిత్రాంగద సింగ్ మాజీ భర్త అరెస్ట్.. చేతిలో తుపాకీ, తీవ్రమైన నేరం!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకల కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు సందర్భాల్లో బెయిలు తో బయటపడ్డ సల్మాన్ ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. సల్మాన్ ఖాన్ వివాదాన్ని మరువక ముందే మరో సెలెబ్రిటీ అజావి జంతులని వేటాడిన కేసులో చిక్కుకున్నాడు. అతడెవరో కాదు బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ మాజీ భర్త జ్యోతి రంధవ. జ్యోతి రంధవ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన గోల్ఫ్ క్రీడా కారుడు. అడవి మృగాలని వేటాడిన కేసులో జ్యోతి రంధవ అరెస్ట్ కావడం సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
గోల్ఫ్ క్రీడాకారుడిగా
పలు సందర్భంలో రంధవ టాప్ 100 ర్యాంకింగ్ లో కొనసాగాడు. గోల్ఫ్ క్రీడలో రంధవ 2004, 2009 మధ్య కాలంలో అత్యుతమ ప్రదర్శన కనబరిచాడు. 2001 లో చిత్రాంగద సింగ్, జ్యోతి రంధవ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దశాబ్దానికి పైగా కలసి ఉన్న ఈ జంట 2014 లో విభేదాల కారణంగా విడిపోయారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
దుద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్
నేటి ఉదయం రంధవ ఉత్తరప్రదేశ్ లోని దుధ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పోలీసులకు పట్టుబట్టలు తెలుస్తోంది. ఆ సమయంలో రంధావ తోడేళ్ళు, మరికొన్ని జంతువులని వేటాడుతున్నట్లు కేసు నమోదు చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. రంధవ నుంచి పోలీసులు ఏ22 తుపాకీ, తోడేలు చర్మం, వాహనం, వేటాడే కొన్ని వస్తువులని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. రంధవ అరెస్ట్ తో సినీ రాజకీయ వర్గాలు షాక్ కి గురవుతున్నాయి.
సాధారణమైన కేసు కాదు
అడవి మృగాలని వేటాడడం అనేది సాధారణమైన కేసు కాదు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత 20 ఏళ్లుగా ఈ కేసు వలన చిక్కులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రంధవకు ఈ కేసు వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రంధవ 1994లో గోల్ఫ్ ఆటగాడిగా కెరీర్ ని ప్రారంభించాడు. పలు సందర్భాల్లో రంధవ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
పుట్టింది ఉత్తరప్రదేశ్లోనే
రంధవ సొంతరాష్ట్రం ఉత్తర ప్రదేశే. 1972లో లఖిమ్ పూర్ ఖేరి జిల్లాలో రంధవ జన్మించాడు. రంధవ తండ్రి ఆర్మీ మాన్ కావడంతో వీరికి ఉత్తర ప్రదేశ్ లో ఇల్లు కూడా ఉంది. గోల్ఫ్ ఆటగాడిగా కెరీర్ ప్రారంభించాక రంధవ ఢిల్లీలో నివాసం ఏర్పరుచుకున్నాడు. తాజాగా వేట కోసం అని ఉత్తర ప్రదేశ్ వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ జరిగిన తరువాత రంధవని కోర్టులో హాజరు పరుస్తాం అని పోలీసులు చెబుతున్నారు.